Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు.. 21 రోజుల్లో 2.5 కోట్ల హుండీ ఆదాయం

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.. స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత గత 21 రోజుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు హుండీ ఆదాయం సమకూరింది.

Yadadri Temple: యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు.. 21 రోజుల్లో 2.5 కోట్ల హుండీ ఆదాయం
Yadadri Temple
Follow us
Surya Kala

|

Updated on: May 12, 2023 | 8:03 AM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.. స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత గత 21 రోజుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు హుండీ ఆదాయం సమకూరింది. గత మూడు వారాల్లో స్వామివారి ఆదాయం.. అక్షరాలా 2 కోట్ల 5 లక్షల 55 వేల 422 రూపాయలు. ఈ నగదుతోపాటు 45 గ్రాముల బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండి కూడా భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు.

టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. హుండీ ఆదాయంతోపాటు మొత్తంగా ఆలయ వార్షిక ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరణ చేసి అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు రవాణా, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడం వలన భక్తుల సంఖ్య భారీగా పెరగమే దీనికి కారణం. ఒకప్పుడు వారాంతాల్లో ఏడెనిమిది వేలు ఉండే భక్తుల సంఖ్య ఇప్పుడు 30 నుంచి 40 వేల మధ్య ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి