AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణించిన వారిని ఎందుకు విమర్శించకూడదు? కారణం ఇదే

సాధారణంగా, చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా చెప్పకూడదని పెద్దలు ఎల్లప్పుడూ చెబుతారు. సాధారణ కారణం స్పష్టంగా చెప్పకపోయినా, ఇది తప్పని చెప్పటమే వారి ఉద్దేశం. హిందూ ధర్మంలోని అనేక గ్రంథాలు కూడా మరణించిన వారిని విమర్శించడం తప్పు అని సూచిస్తున్నాయి. మరణించిన వ్యక్తి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, అతడిని చనిపోయిన తర్వాత అవమానించడం తగదు అని ఈ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి.

మరణించిన వారిని ఎందుకు విమర్శించకూడదు? కారణం ఇదే
After Death
Rajashekher G
|

Updated on: Jan 04, 2026 | 6:55 PM

Share

సాధారణంగా చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవద్దని పెద్దలు చెబుతుంటారు. దీనికి సరైన కారణంగా చెప్పికపోయినప్పటికీ అలా చేయకూడదని అంటున్నారు. మరణించిన వారిని విమర్శించకూడదని హిందూ ధర్మంలోని పలు పుస్తకాలు చెబుతున్నాయి. మరణించిన వ్యక్తి ద్వారా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. చనిపోయిన తర్వాత అతడ్ని అవమానించకూడదని చెబుతున్నాయి.

మరణించిన వ్యక్తుల గురించి మాట్లాడటం మానుకోవాలి. లేదంటే వారితో మనకున్న మంచి జ్జాపకాలను మాత్రమే గుర్తు చేసుకోవాలి. మరణాంతరం వారిని ఎందుకు విమర్శించకూడదో అందుకు గల కారణాలను మనుస్మృతిలో వివరించారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మనుస్మృతి ప్రకారం.. మరణించిన వ్యక్తి ఇప్పుడు లేకపోయినా.. మన చర్యలు వారితో ఎప్పటికీ ముడిపడి ఉంటాయి. మరణించిన వ్యక్తిని మనం విమర్శించినా లేదా అవమానించినా.. వారితో మనకున్న భావోద్వేగ సంబంధం ఎప్పటికీ తెగిపోదు. మనుస్మృతి ప్రకారం.. మరణించిన వారిని విమర్శించడం తీవ్రమైన నేరం. మరణించిన వ్యక్తిని ఎగతాళి చేసినవారికి నరకంలో కూడా స్థానం లభించదని నమ్ముతారు.

పురాతన గ్రంథాల ప్రకారం.. పురాతన గ్రంథాల ప్రకారం మరణించిన వ్యక్తులను ఎందుకు విమర్శించకూడదో స్పష్టంగా తెలిపాయి. మహా భారతంలోని శాంతి పర్వంలో.. యుధిష్టిరుడు.. భీష్మ పితామహుడి నుంచి పొరపాటున కూడా మరణించిన వ్యక్తిని అవమానించకూడదని నేర్చుకున్నాడు. అలా చేయడం వల్ల మరణించినవారికి ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.

మరణించిన వ్యక్తి మంచివాడు లేదా చెడ్డవాడు అయినప్పటికీ.. చనిపోయిన తర్వాత మాత్రం అతడ్ని విమర్శించకూడదు. చెడుగా మాట్లాడకూడదు. ఎందుకంటే మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం మనకు ఎలాంటి మంచిని కలిగించదు. ప్రతీ మతం కూడా పొరపాటున కూడా చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదని చెబుతుంది. మరణం తర్వాత ఆ వ్యక్తి ప్రాపంచిక అనుబంధాలకు అతీతంగా ఎదుగుతాడని భావిస్తారు.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.

వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. ఆల్ టైం రికార్డ్ స్థాయికి..
వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. ఆల్ టైం రికార్డ్ స్థాయికి..
ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు.. అది నాకు పెద్ద షాక్..
ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు.. అది నాకు పెద్ద షాక్..
ఖరీదైన మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఉదయం నిద్ర లేవగానే ఈ 4 పనులు చేస్తే
ఖరీదైన మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఉదయం నిద్ర లేవగానే ఈ 4 పనులు చేస్తే
వార్నీ.. వీడి ఇష్టం తగలేయా..! పెంపుడు పాముకు ప్రేమగా తినిపించాడు
వార్నీ.. వీడి ఇష్టం తగలేయా..! పెంపుడు పాముకు ప్రేమగా తినిపించాడు
సచిన్‌కు షాకిచ్చాడు.. రోహిత్‌ను వెలికితీశాడు.. కట్‌చేస్తే..
సచిన్‌కు షాకిచ్చాడు.. రోహిత్‌ను వెలికితీశాడు.. కట్‌చేస్తే..
ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ వేదికైంది: మండలిలో ఎమ్మెల్సీ కవిత
ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ వేదికైంది: మండలిలో ఎమ్మెల్సీ కవిత
అభిమానమా.. పైత్యమా..! మితిమీరిన అభిమానంతో ఏకంగా బన్నీనే..
అభిమానమా.. పైత్యమా..! మితిమీరిన అభిమానంతో ఏకంగా బన్నీనే..
ఏఐలో ఇలా సెర్చ్ చేస్తే మీరు జైలుకే.. తప్పక ఈ విషయాలు తెలుసుకోండి
ఏఐలో ఇలా సెర్చ్ చేస్తే మీరు జైలుకే.. తప్పక ఈ విషయాలు తెలుసుకోండి
'నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు'..
'నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు'..
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎఫెక్ట్
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎఫెక్ట్