AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vrindavan: ఈ ఆలయం నుంచి వైకుంఠ ద్వారం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం.. ఎక్కడంటే..

ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసే బ్రజ్ భూమిలో ప్రధానంగా మధుర, బృందావనం, గోవర్ధన, బర్సానా, నందగావ్, గోకుల్ ఉన్నాయి. బ్రజ్‌ హిందువులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ చాలా పవిత్రమైన గోవర్ధన్ కొండ కూడా ఉంది. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని , యవ్వనాన్ని గడిపిన బ్రజ్‌లో శ్రీ కృష్ణుడి ప్రసిద్ధ ఆలయాలు చాలా ఉన్నాయి. వీటిలో శ్రీ విష్ణువు వైకుంఠానికి వెళ్ళే మార్గం ఉన్న ఒక ఆలయం కూడా ఉంది. ఈ రోజు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం..

Vrindavan: ఈ ఆలయం నుంచి వైకుంఠ ద్వారం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం.. ఎక్కడంటే..
Ranganath Temple
Surya Kala
|

Updated on: Jun 01, 2025 | 3:48 PM

Share

మనిషి మోక్షాన్ని కోరుతూ వైకుంఠాన్ని చేరుకోవడానికి ప్రజలు జీవితాంతం అనేక ఉపవాసాలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. అయితే శ్రీ మహా విష్ణువు నివాసం వైకుంఠం నివాసానికి ఎలా వెళ్ళాలనేది ఎవరికీ తెలియదు. అయితే భూమిపై ఒక ఆలయం నుంచి వైకుంఠానికి వెళ్లేందుకు ఒక ద్వారం ఉందని నమ్ముతారు. శ్రీ కృష్ణుడి నడయాడిన బృందావనంలో అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడి ప్రతి వీధిలోనూ గడిపాడు. మధుర-బృందావన్ దేవాలయాలలో శ్రీకృష్ణుని గురించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ ఆలయాలలో లోక రక్షకుడైన విష్ణువు మార్గం వైకుంఠానికి వెళ్ళే ఆలయం ఉంది. ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది. కనుక ప్రతి సంవత్సరం భక్తులు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వస్తారు.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఇది శ్రీ కృష్ణ భగవానుడి అద్భుతమైన ఆలయం పేరు. శ్రీ రంగనాథ ఆలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని చుంగి చౌరాహా సమీపంలో ఉంది. ఇది దక్షిణ శైలిలో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని బ్రజ్‌లోని రంగనాథుడి ఆలయం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ రంగనాథుడు నివసిస్తున్నాడని నమ్మకం.

వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుంది? ఈ ఆలయంలో, దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం 21 రోజుల పాటు వైకుంఠ ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో 11వ రోజున వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది. అందుకే భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆలయం గురించి నమ్మకం అంటే ఏమిటి? ఈ ఆలయంతో ముడిపడి ఉన్న ఒక నమ్మకం ఏమిటంటే.. ఆళ్వార్ సన్యాసి ఆత్మ వైకుంఠానికి వెళ్ళడానికి మార్గం కోసం విష్ణువును అడిగాడని.. దానికి సమాధానంగా శ్రీ విష్ణువు లక్ష్మీ దేవితో కలిసి ఆళ్వార్ సన్యాసికి వైకుంఠ లోకానికి ఎలా చేరుకోవాలో చెప్పాడు. ఆ తరువాత నుంచి ఈ ఆలయంలోని వైకుంఠ ద్వారం సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటుంది. ఈ పవిత్రమైన రోజున ద్వారం గుండా వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు