AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. ఆ సేవలు రద్దు..

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. ఆ సేవలు రద్దు..
Tirupati Pavithrotsavam
Surya Kala
|

Updated on: Aug 08, 2022 | 9:47 AM

Share

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్ నేటి నుంచి మూడు రోజుల పాటు.. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రక్తంగా వేద పండితులు అంకురార్పణ చేశారు. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు.  అనంతరం సంపంగి ప్రకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవోఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. తిరిగి 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఈరోజు పవిత్రాల ప్రతిష్ట, రేపు పవిత్ర సమర్పణ, ఆగష్టు 10న పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఉత్సవాల నేపథ్యంలో ఆర్జితసేవలు రద్దు

ఇవి కూడా చదవండి

ఈ ప‌విత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్ధు చేసింది. అదేవిధంగా నేటి నుంచి 10వ తేదీ వ‌ర‌కు అంటే మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. అంతేకాదు రేపు (ఆగష్టు9వ తేదీ) అష్టద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌ని కూడా టీటీడీ రద్దు చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..