AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఎగరేస్తే బ్లాస్ట్ అవ్వాల్సిందే.. త్వరలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్‌ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. కొండపై భద్రతకు పెద్దపీట సరే.. మరి కేంద్రం అనుమతి ఇస్తుందా?.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.. అనేది చర్చనీయాంశంగా మారింది.

Tirumala: ఎగరేస్తే బ్లాస్ట్ అవ్వాల్సిందే.. త్వరలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌!
Tirumala
Shaik Madar Saheb
|

Updated on: May 13, 2025 | 7:24 PM

Share

తిరుమల శ్రీవారి ఆలయంపై తరచుగా డ్రోన్ల సంచారం.. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ని కలవరపెడుతోంది. ఈ క్రమంలో యాంటీ డ్రోన్‌ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని చాలాసార్లు టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మధ్య కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి కూడా లేఖ రాసింది. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. సాధ్యమైనంత త్వరగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.

ఈ టెక్నాలజీతో కొండ పరిసర ప్రాంతాలపై వీడియో ట్రాకింగ్‌ ఉంటుంది. ఇందులో లాంగ్ రేంజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌.. సుదూర ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగరేసినా ఇట్టే పసిగడుతుంది. ఆర్‌ ఎఫ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌తో ఆపరేటర్‌కు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఆర్‌ ఎఫ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అనుమానిత వస్తువుల్ని ఐడెంటిఫై చేయగానే.. మొబైల్ రెస్పాన్స్ టీమ్‌ అలర్ట్ అవుతుంది. ఆ తర్వాత జామింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తారు. దీంతో డ్రోన్‌ను నియంత్రించే సంకేతాలను నియంత్రించి.. అడ్డగిస్తుంది. రెప్పపాటులో డ్రోన్‌ దగ్గరకు వెళ్లి దాన్ని క్రాష్ చేస్తుంది.

ఈ టెక్నాలజీతో కొండపై భద్రతను పటిష్టం చేసుకోవాలనుకుంటోంది టీటీడీ. 2023లో IOCL గ్యాస్ ప్లాంట్ సర్వేకి వచ్చిన కొందరు డ్రోన్‌తో శ్రీవారి ఆలయాన్ని మాడ వీధుల్ని చిత్రీకరించారు. 2024లో హరియాణాకు చెందిన ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేసి శ్రీవారి మెట్టు, నడకమార్గాన్ని చిత్రీకరించాడు.

ఈ మధ్య రాజస్థాన్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ మాడవీధులతో పాటు అఖిలాండం వరకు డ్రోన్‌తో షూట్ చేశాడు. ఇలా జరిగినప్పుడల్లా విజిలెన్స్ అధికారులు డ్రోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అదే యాంటీ డ్రోన్‌ సాంకేతికత అందిపుచ్చుకుంటే డ్రోన్ ఎగిరే ఛాన్సే ఉండదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే