Tirupati: కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు.. ఈ వాహన సేవ దర్శన విశిష్టత ఏమిటంటే..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా స్వామివారి వైభవం ఉంటుంది. అయితే శ్రీవారి  బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజు ఇవాళ ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది.

| Edited By: Surya Kala

Updated on: Sep 21, 2023 | 1:14 PM

నారాయణుడి లీలలు నవరస భరితాలు. శ్రీ మహావిష్ణువు విష్ణువు ఎన్ని అవతారాలెత్తినా అవన్నీ దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ కోసమే. 9 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు చెప్పేది కూడా ఇదే. ఈ  ఉత్సవాలలో నాలుగో రోజు ఉదయం స్వామి వారు తన కల్ప వృక్ష వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. 

నారాయణుడి లీలలు నవరస భరితాలు. శ్రీ మహావిష్ణువు విష్ణువు ఎన్ని అవతారాలెత్తినా అవన్నీ దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ కోసమే. 9 రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు చెప్పేది కూడా ఇదే. ఈ  ఉత్సవాలలో నాలుగో రోజు ఉదయం స్వామి వారు తన కల్ప వృక్ష వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. 

1 / 7
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మలయప్ప స్వామి కామితార్థ ప్రదాయిని కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మలయప్ప స్వామి కామితార్థ ప్రదాయిని కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. 

2 / 7
 స్వామివారి వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు.

 స్వామివారి వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు.

3 / 7
జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

4 / 7
క‌ల్ప‌వృక్షం వాహనంగా ఊరేగుతున్న స్వామిని దర్శిస్తే పూర్వజన్మస్మరణ కలుగుతుందని భక్తుల నమ్మకం.. అంతేకాదు దేవేరులతో కలిసి ఊరేగే స్వామివారిని కన్నులారా దర్శిస్తే కోరుకున్న‌ కోర్కెలు తీరుతాయని నమ్మకం.  తిరుమాడ వీధులలో శ్రీవారు భక్తులకు తనివితీరా దర్శనమిచ్చాడు.

క‌ల్ప‌వృక్షం వాహనంగా ఊరేగుతున్న స్వామిని దర్శిస్తే పూర్వజన్మస్మరణ కలుగుతుందని భక్తుల నమ్మకం.. అంతేకాదు దేవేరులతో కలిసి ఊరేగే స్వామివారిని కన్నులారా దర్శిస్తే కోరుకున్న‌ కోర్కెలు తీరుతాయని నమ్మకం.  తిరుమాడ వీధులలో శ్రీవారు భక్తులకు తనివితీరా దర్శనమిచ్చాడు.

5 / 7
పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం వుంది. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకో ఈరోజు ఉదయం జరిగిన వాహ‌న‌సేవ‌లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డితోపాటు  జీయర్ స్వాములు పాల్గొన్నారు.

పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం వుంది. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకో ఈరోజు ఉదయం జరిగిన వాహ‌న‌సేవ‌లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డితోపాటు  జీయర్ స్వాములు పాల్గొన్నారు.

6 / 7
ఇక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

ఇక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

7 / 7
Follow us