AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆలయం సత్యయుగానికి సాక్ష్యం.. బ్రహ్మ పురోహితుడిగా మారి శివపార్వతులకు పెళ్లి చేసిన ఆలయం.. ఎక్కడంటే..

ఈ శివాలయాన్ని త్రియుగినారాయణ అని అంటారు. ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖిమత్ బ్లాక్‌లో ఉంది. దీనిని దేవభూమి అని పిలుస్తారు. సముద్ర మట్టానికి 6495 అడుగుల ఎత్తులో కేదార్ లోయలో ఉన్న జిల్లాలోని ఉపాంత గ్రామ పంచాయతీకి ఈ ఆలయం కారణంగా త్రియుగినారాయణ అని పేరు వచ్చింది. ఈ ఆలయం త్రేతాయుగంలో నిర్మించబడిందని నమ్ముతారు. అంతేకాదు శివపార్వతి వివాహానికి ఏకైక సాక్షి ఇక్కడ జ్వలించే అఖండ ధుని.

ఈ ఆలయం సత్యయుగానికి సాక్ష్యం.. బ్రహ్మ పురోహితుడిగా మారి శివపార్వతులకు పెళ్లి చేసిన ఆలయం.. ఎక్కడంటే..
Triyuginarayan Temple
Surya Kala
|

Updated on: Aug 05, 2024 | 1:25 PM

Share

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని శివుని ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి దాని సొంత కథ, రహస్యం, విశిష్టత ఉంది. అలాంటి శివుని ఆలయాల్లో ఒకటి శివపార్వతుల వివాహానికి సంబంధించినది. ఈ ప్రదేశంలో పరమశివుడు పార్వతితో కలిసి ఏడు అడుగు వేశాడని చెబుతారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని దంపతులు ఆది దంపతులైన శివపార్వతుల అనుగ్రహం పొందేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు ఏడాది పొడవునా ఈ ఆలయానికి వస్తారు. ఎక్కువ మంది ఇక్కడ పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు.

ఈ ఆలయం ఎక్కడ ఉంది? (త్రియుగినారాయణ ఆలయం ఎక్కడ ఉంది)

ఈ శివాలయాన్ని త్రియుగినారాయణ అని అంటారు. ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖిమత్ బ్లాక్‌లో ఉంది. దీనిని దేవభూమి అని పిలుస్తారు. సముద్ర మట్టానికి 6495 అడుగుల ఎత్తులో కేదార్ లోయలో ఉన్న జిల్లాలోని ఉపాంత గ్రామ పంచాయతీకి ఈ ఆలయం కారణంగా త్రియుగినారాయణ అని పేరు వచ్చింది. ఈ ఆలయం త్రేతాయుగంలో నిర్మించబడిందని నమ్ముతారు. అంతేకాదు శివపార్వతి వివాహానికి ఏకైక సాక్షి ఇక్కడ జ్వలించే అఖండ ధుని.

ఇవి కూడా చదవండి

శివ-పార్వతి వివాహం చేసుకున్న వివాహ స్థలం

పార్వతిదేవి హిమవంత రాజు కుమార్తె. పరమశివుడిని భర్తగా పొందాలనే కోరికతో పార్వతిదేవి కఠోర తపస్సు చేసింది. ఆ తర్వాత శివ పార్వతిల వివాహం జరిగింది, పురాణాల ప్రకారం శివపార్వతి వివాహం జరిగే సమయంలో శ్రీ మహా విష్ణువు.. పార్వతి దేవికి సోదరుడు అయ్యాడు. వివాహ కత్రువులో పాల్గొన్నాడు. శివ పార్వతుల వివాహం జరిగే సమయంలో అన్ని ఆచారాలను శ్రీ మహా విష్ణు నిర్వహించారు. సత్యయుగంలో వివాహం చేసుకున్నారని పురాణాల్లో పేర్కొన్నాయి.

పూజారిగా మారిన బ్రహ్మదేవుడు

శివపార్వతుల వివాహాన్ని నిర్వహించడానికి బ్రహ్మ దేవుడు పూజారి అయ్యాడు. అందువల్ల ఆలయానికి ఎదురుగా ఉన్న వివాహ స్థలాన్ని బ్రహ్మ శిల అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో ఈ వేడుకలో పలువురు సాధువులు, ఋషులు పాల్గొన్నారు. శివ పార్వతుల పెళ్లి జరిగిన ఈ దివ్యమైన ప్రదేశం గురించి హిందూ పురాణాలలో ప్రస్తావించబడింది.

ఇక్కడ మూడు నీటి చెరువులు ఉన్నాయి

వివాహం కోసం అతిధులుగా హాజరైన దేవతలు వివాహానికి ముందు స్నానం చేయడం కోసం ఇక్కడ మూడు నీటి చెరువులు నిర్మించబడ్డాయి. వీటిని రుద్ర కుండం, విష్ణు కుండం, బ్రహ్మ కుండం అని అంటారు. మూడు సరస్సులో ఒక కుండంలో సరస్వతి కుండం నుంచి వస్తుంది. పురాణాల ప్రకారం సరస్వతి కుండం విష్ణువు నాసికా రంధ్రాల నుండి ఉద్భవించింది. అందుచేత ఈ చెరువులో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.

శివపార్వతుల వివాహం సమయంలో వెలిగించిన హోమ గుండం ఇప్పటికీ అక్కడ వెలుగుతూనే ఉందని నమ్మకం. మూడు యుగాలుగా ఈ హోమం ఆరిపోలేదని.. అక్కడ ఉన్నవారు ఈ హోమం వెలిగేందుకు కర్రలు, నెయ్యి వంటి వస్తువులు వేస్తూ ఉంటారని.. చెబుతారు. ఈ అఖండ ధుని చుట్టూ శివపార్వతులు సప్త పదితో వివాహం చేసుకున్నారని నమ్మకం. అందుకనే నేటికీ దంపతులు ఈ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు.

విష్ణువు వామన అవతారం దాల్చిన ప్రదేశం

పురాణాల ప్రకారం సత్య యుగం నుంచి త్రియుగినారాయణ ఇక్కడ ఉంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ద్వాపరయుగంలో స్థాపించబడ్డాయి. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే విష్ణువు వామన అవతారం ఎత్తాడు. కథ ప్రకారం ఇంద్రాసనాన్ని పొందడానికి రాక్షస రాజు బలి వంద యాగాలు చేయవలసి వచ్చింది. అందులో అతను 99 యాగాలు పూర్తి చేసాడు. అప్పుడు విష్ణువు వామన అవతారం దాల్చి బలి చేస్తున్న యాగాన్ని ఆపాడు. అందువలన ఇక్కడ విష్ణువు వామనుడుగా పూజింపబడుతున్నాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు