AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!

వరుసగా రెండో ఏడాది కూడా పూరి జగన్నాథ యాత్ర బోసిపోయి కన్పించబోతోంది. కరోనా కారణంగా రథయాత్రకు భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!
Lord Jagannath Rath Yatra
Balaraju Goud
|

Updated on: Jun 11, 2021 | 9:42 AM

Share

Lord Jagannath Rath Yatra 2021: వరుసగా రెండో ఏడాది కూడా పూరి జగన్నాథ యాత్ర బోసిపోయి కన్పించబోతోంది. కరోనా కారణంగా రథయాత్రకు భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారితో సామాన్యులకే దేవుళ్లకు కూడా తీరని కష్టాలు వచ్చాయి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ప్రసిద్ది గాంచిన పూరి జగన్నాథ రథయాత్రను భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తూ రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పరిమిత స్థాయిలో భక్తులు. అర్చకులు జగన్నాధుడి రథయాత్రలో పాల్గొంటారు. అది కూడా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవాళ్లు , కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవాళ్లతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం జులైలో జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ప్రతి ఏటా పూరి జగన్నాథరథయాత్రను లక్షలమంది భక్తులతో కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాని కరోనా మహమ్మారి కారణంగా ఈ ఉత్సవాలను నామమాత్రంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతోనే రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జగన్నాథ రథయాత్ర నిర్వహించే రోజున పూరిలో కర్ఫ్యూ విధిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

పూరిలో తొమ్మిదిరోజుల పాటు సాంప్రదాయరీతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తులు ప్రత్యక్ష ప్రసారంతో వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాలను వీక్షించవచ్చని రిలీఫ్‌ కమిషనర్‌ తెలిపారు. పూరికి వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే ఆరోజు అనుమతి ఉంటుంది.

ఇదిలావుంటే, పూరి నగరంలో ఇప్పటికి కూడా ప్రతిరోజు 300కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. రథాల తయారీ ఆఖరి దశకు చేరుకుందని కూడా అధికారులు వెల్లడించారు. జగన్నాధుడు తన సోదరుడు బలభద్రుడు , సుభద్రతో కలిసి రథయాత్ర నాడు ఊరేగడం ఆనవాయితీగా వస్తోంది. రథయాత్ర రెండున్నర కిలోమీటర్ల మేర సాగి గుండిచ ఆలయానికి చేరుకుంటుంది. ఈ దృశ్యాన్ని భక్తులు ఎంతో పారవశ్యంతో తిలకిస్తారు. కాని ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది.

Read Also…  AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..