Yadadri Temple: యాదాద్రీశుడికి విరాళంగా మరో కిలో బంగారం ఇవ్వనున్న ఆ నియోజకవర్గ ప్రజలు..

Minister Harish Rao: తెలంగాణ(Telanagana) సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి (Yadadri Lakshmi Narasimha swamy) విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు..

Yadadri Temple: యాదాద్రీశుడికి విరాళంగా మరో కిలో బంగారం ఇవ్వనున్న ఆ నియోజకవర్గ ప్రజలు..
Yadadri Temple Gopuram
Follow us

|

Updated on: Feb 03, 2022 | 3:12 PM

Yadadri Temple: తెలంగాణ(Telanagana) సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి (Lakshmi Narasimha swamy) విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాదాద్రీశుడి ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి తమ వంతుగా రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ వంతుగా బంగారం విరాళంగా ఇస్తున్నారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి యాదాద్రీశుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి ఇప్పటికే కిలో బంగారం ఇచ్చామని.. మరో విడతగా ఇంకో కిలో బంగారం సమర్పిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమని చెప్పారు. తెలంగాణాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయం విరాజిల్లుతోందన్నారు హరీష్ రావు. ప్రధానాలయ ఉద్ఘాటన మార్చి నెలలో చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి హైద్రాబాద్ కు వచ్చే పర్యాటకులతో యాదాద్రి ఆలయం.. ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రంగా విరాజిల్లనుందని .. దీంతో యాదాద్రి చుట్టు పక్కల ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మా దృష్టికి తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసువెళ్తానని చెప్పారు.

యాదాద్రీశుడి ఆలయ గోపురానికి బంగారం తాపడం చేయించాలని తలపెట్టిన పనుల కోసం రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా బంగారం విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే సీఎంతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు బంగారం అందజేశారు. తిరుమల తరహాలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించనున్నట్లు.. అందుకు 125 కిలోల బంగారం అవసరమవుతుందని సీఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

అతనికి వేలంలో భారీ డిమాండ్ ఉంటుంది.. ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో చెప్పిన బ్రాడ్ హాగ్..

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!