AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

శనివారం రోజున టోకెన్లు లేని భక్తులకు దాదాపు 6 నుంచి 8 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతుంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala
Jyothi Gadda
|

Updated on: Oct 27, 2024 | 12:11 PM

Share

దీపావళి పండుగ సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శనివారం రోజున టోకెన్లు లేని భక్తులకు దాదాపు 6 నుంచి 8 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతుంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు శ్రీవారి దర్శనానికి నేరుగా పంపుతున్నారు.శనివారం స్వామి వారిని 77,884 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 27,418 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు.తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.327 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..