AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clay Ganesh Immersion: ప్రతిష్టించిన చోటే.. వినాయకుడి నిమజ్జనం.. మట్టిని పొలానికి సేంద్రియ ఎరువుగా వాడతామన్న నిర్వాహకులు

మట్టి గణనాధుని ప్రతిమను పంచామృతాలతో  అభిషేకించి, గంగా పూజ నిర్వహించి ప్రతిష్టించిన చోటనే నీటితో కరిగించారు. నిమజ్జనం అనంతరం విగ్రహ తయారీకి వాడిన మట్టి, గడ్డిని పొలాలలో సేంద్రియ ఎరువులుగా వాడుతామని నిర్వహకులు తెలిపారు.

Clay Ganesh Immersion: ప్రతిష్టించిన చోటే.. వినాయకుడి నిమజ్జనం.. మట్టిని పొలానికి సేంద్రియ ఎరువుగా వాడతామన్న నిర్వాహకులు
Clay Ganesh Immersion
Surya Kala
|

Updated on: Sep 13, 2022 | 3:40 PM

Share

Clay Ganesh Immersion: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహల ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతోంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో నిమజ్జనం చేయడం ద్వారా రంగులు నీటిలో కలిసి కలుషితం అయ్యేది. దీంతో మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్లుగా ఓ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. మొత్తం మీద నెమ్మదిగా భారీ ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే మట్టితో తయారు చేసిన ఎత్తైన విగ్రహాలను ఈఏడాది చాలా చోట్ల ప్రతిష్టించారు.

కుత్బుల్లాపూర్ ‌సర్కిల్ సూరారం కాలనీలోని శ్రీవినాయక యువజన సంఘం 28 అడుగుల మట్టి విగ్రహాన్ని అక్కడే తయారు చేయించి‌ ప్రతిష్టించారు. 13 రోజులపాటు విశేష పూజలందుకున్న గణపయ్యకు వినూత్నరీతిలో అక్కడే నిమజ్జనం చేశారు నిర్వాహకులు.

మట్టి గణనాధుని ప్రతిమను పంచామృతాలతో  అభిషేకించి, గంగా పూజ నిర్వహించి ప్రతిష్టించిన చోటనే నీటితో కరిగించారు. నిమజ్జనం అనంతరం విగ్రహ తయారీకి వాడిన మట్టి, గడ్డిని పొలాలలో సేంద్రియ ఎరువులుగా వాడుతామని నిర్వహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..