Ayodhya:తెలుగువారి అదృష్టం.. అయోధ్య రామయ్య గుడి తలుపులు తయారీ భాగ్యనగరంలోనే .. ఎవరు చేశారంటే..

రామమందిరం ప్రకృతి లో ఎటువంటి విపత్తి ఏర్పడినా చెక్కు చెదరకుండా.. పటిష్టంగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్‌, ఫర్నీచర్‌, వస్తువులను వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణంలో మేము సైతం అంటూ అనేక మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు. ఆలయ నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్‌ కంపెనీ కూడా పాలుపంచుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు. 

Ayodhya:తెలుగువారి అదృష్టం.. అయోధ్య రామయ్య గుడి తలుపులు తయారీ భాగ్యనగరంలోనే .. ఎవరు చేశారంటే..
Ayodhya Ram Mandir
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Dec 28, 2023 | 5:47 PM

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామయ్య కొలువు దీరే సమయం ఆసన్నం అయింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యాపురి సరయు నది తీరంలో రామ్ లల్లా ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. కోట్లాది మంది కలతీర్చే విధంగా నిర్మిస్తున్న ఈ ఆలయం ఎటువంటి ప్రకృతి విపత్తు ఏర్పడినా చెక్కు చెదరకుండా నిలబడనుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రామాలయాన్ని నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు.

ఈ రామాలయాన్ని జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బాల రామయ్య విగ్రహం గర్భ గుడిలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రతిష్టించనున్నారని పండితులు చెప్పారు. ఈ శుభ ముహర్త సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రామమందిరం ప్రకృతి లో ఎటువంటి విపత్తి ఏర్పడినా చెక్కు చెదరకుండా.. పటిష్టంగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్‌, ఫర్నీచర్‌, వస్తువులను వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణంలో మేము సైతం అంటూ అనేక మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు. ఆలయ నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్‌ కంపెనీ కూడా పాలుపంచుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు.

రామమందిరం తలుపులు భాగ్యనగరంలోని తయారవుతున్నాయి. సికింద్రాబాద్ లోని న్యూ బోయినపల్లిలో ఉన్న అనూరాధ టింబర్ డిపోలో రామాలయానికి సంబంధించిన తలుపులను రెడీ చేస్తున్నారు.  తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు  60 మంది ఈ తలుపులను ఏడాది క్రితం నుంచే తయారీ చేయడం ప్రారంభించారు.

ఈ తలుపుల తయారీకి బల్లార్షాకి చెందిన అత్యంత న్యాయమైన టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని శరత్ బాబు వెల్లడించారు. రామాలయంతో పాటు.. ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100 తలుపులను రెడీ చేస్తున్నారు. ప్రారంభోత్సవ సమయం దగ్గర పడడంతో నిర్మాణ పనిలో వేగం పెంచడంతో పాటు.. చరిత్రలో నిలిచే ఈ క్రతువులో పాల్గొనడం పాల్గొనే భాగ్యం తమకు దక్కడం అదృష్టమని చెప్పారు.

రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమం కనులారా వీక్షించేందుకు అయోధ్యకు చేరుకోవడానికి లక్షలాది మంది సన్నాహాలు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు భారీగా భక్తులు రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తీని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బస చేయడానికి హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!