Ayodhya: కళాకారుడి అపురూప సృష్టి.. అయోధ్య రామాలయం.. కార్మికుల ఆనందం త్రీడీ ఎఫెక్స్ట్లో రంగోలి..
నగరంలోని ఓ ప్రైవేట్ మాల్ లో రామాలయ రూపంతో ఉన్న రంగోలీ చూపరులను ఆకర్షిస్తోంది. ఈ రంగోలి చిత్రం 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో డిజైన్ చేశారు. అయితే ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే రామమందిర నిర్మాణం సమయంలో పని చేసిన కార్మికులు తదితరులు.. రామమందిర నిర్మాణం అయ్యాక దర్శనం చేసుకున్నట్లు ఉన్నది. ఈ రాముడి దర్శనం అనే కాన్సెప్ట్ ను త్రీడీ ఎఫెక్ట్ లో కళాకారుడు ఆవిష్కరించాడు.
అయోధ్యలో రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నం అవుతోంది. రామాలయ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లో రామనామ స్మరణతో మారు మ్రోగుతోంది. రాముడిపై భక్తిని ప్రజలు వివిధ మార్గాల్లో చాటు కుంటున్నారు. తాజాగా ఓ ప్రయివేట్ స్కూల్ లో స్టూడెంట్స్ తమ ప్రతిభకు వన్నె తెచ్చే విధంగా ధర్మా కోల్ తో అయోధ్య రామయ్య ఆలయ రూపాన్ని మలచారు. అంతేకాదు ఓ కళాకారుడు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పురష్కరించుకుని రంగోలి వేశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ మాల్ అయోధ్య రామ మందిర రూపంతో ఉన్న రంగోలీ చూపరులను ఆకర్షిస్తోంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సిలికాన్ సిటీలో రాముడి స్మరణ హోరెత్తుతోంది. రామమందిరం రంగోలిలో వికసిస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ మాల్ లో రామాలయ రూపంతో ఉన్న రంగోలీ చూపరులను ఆకర్షిస్తోంది. ఈ రంగోలి చిత్రం 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో డిజైన్ చేశారు. అయితే ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే రామమందిర నిర్మాణం సమయంలో పని చేసిన కార్మికులు తదితరులు.. రామమందిర నిర్మాణం అయ్యాక దర్శనం చేసుకున్నట్లు ఉన్నది. ఈ రాముడి దర్శనం అనే కాన్సెప్ట్ ను త్రీడీ ఎఫెక్ట్ లో కళాకారుడు ఆవిష్కరించాడు. ఈ గుడిని రంగోలీలో అందంగా చిత్రించినందుకు చాలా సంతోషంగా ఉంది.. హిందువులు రామమందిరాన్ని చూసి గర్వపడుతున్నారు.. రామమందిరాన్ని రంగోలీగా వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే చూపరుల ప్రశంసలు తన కష్టాన్ని మరపించాయని చెబుతున్నాడు. ఆ కళాకారుడు.
మరో వైపు బసవేశ్వర్ నగరంలోని ఫ్లోరెన్స్ పాఠశాలలో పిల్లలకు అయోధ్య గురించి తెలియాలని పాఠశాలలో థర్మాకోల్తో రామమందిరాన్ని నిర్మించి రామమందిర రూపకల్పనపై చిన్నారులకు అవగాహన కల్పించారు. .
మరోవైపు రామోత్సవ్కు కౌంట్డౌన్ ప్రారంభం కావడంతో విమాన టిక్కెట్ల ధరలు పెరిగాయి. బెంగళూరు నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో బెంగళూరు నుంచి అయోధ్యకు వెళ్లే విమాన టికెట్ ధర 6 వేల నుంచి 25 వేలకు పెరిగింది.
శని, ఆదివారాలు సెలవులు కావడంతో ప్రారంభోత్సవానికి ముందే అయోధ్యకు చాలా మంది ప్రయాణికులు వెళుతుండగా, 6వేలు ఉన్న టికెట్ రేటు 20వేలు దాటింది. వాస్తవంగా బెంగళూరు నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధర 6 వేల రూపాయలు. జనవరి 19, శుక్రవారం బెంగళూరు నుండి అయోధ్యకు ఒక్క టికెట్ ధర సుమారు రూ. 25,000-26,000. ఇక జనవరి 20న బెంగళూరు నుంచి అయోధ్యకు టిక్కెట్టు రూ.28,886గా నిర్ణయించారు. ఈ రెండు రోజులు రెండు విమానాలు మాత్రమే బయల్దేరనున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..