Veerabrahmendra Swamy Mutt : ముగిసిన మంత్రి మూడు రోజుల గడువు, వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రాని సయోధ్య

కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి మఠం పిఠాధిపతి విషయంలో రేగిన వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి..

Veerabrahmendra Swamy Mutt : ముగిసిన మంత్రి మూడు రోజుల గడువు,  వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రాని సయోధ్య
Pothuluri Veerabrahmendra S
Follow us

|

Updated on: Jun 22, 2021 | 8:29 AM

Pothuluri Veerabrahmendra Swamy Mutt : కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రేగిన వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి యొక్క ఇరువురు సంతానంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చర్చలు జరిపి మూడు రోజులు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మూడు రోజుల్లో ఏ ఒక్కరు కూడా చర్చల కోసం కూర్చొని కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు. ఇచ్చిన మూడు రోజులు గడువు ముగియడంతో పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇక, ధార్మిక పరిషత్, దేవాదాయ శాఖ జోక్యం చేసుకోనున్నాయి.

కాగా, మఠం పీఠాధిపతిగా పెద్ద కొడుకుగా వంశపారంపర్యంగా నేనే అర్హున్నీ అని పెద్ద భార్య పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామి అంటుంటే, అమ్మకి కిడ్నీ దానం చేశాను.. వీలునామా ప్రకారం నాకే పీఠాధిపతి ఇవ్వాలని రెండో కొడుకు వీర భద్ర స్వామి కోరుతున్నారు. మరోవైపు, స్వామి వారి చివరి కోరిక, రాసిన వీలునామా ప్రకారం నా కొడుకు నే పీఠాధిపతి చేయాలి.. లేదంటే నేనే సంరక్షకురాలిగా ఉంటానని రెండో భార్య మారుతి మహాలక్ష్మి అంటున్నారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నా కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ అంశం మీద వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండటంతో పాటు, ఇప్పుడు మఠం పీఠాధిపతి ఎంపిక క్రమంగా దేవాదాయ శాఖ అధీనంలోకి పోతోంది.

కాగా మఠం పూర్వాపరాల్లోకి వెళ్తే.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది వివాదాస్పదంగా మారింది. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది చిక్కుముడిగా మారింది.

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు.

మొన్నటి వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే, ఇటీవల ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికి ఇవ్వాలనేది పీటముడిగా మారింది.

వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతమ్మ 8 మంది సంతానం. అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండో భార్యను వివాహం చేసుకున్నారు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

మఠాధిపతి నియామకం కోసం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే రాణాప్రతాప్‌ సమక్షంలోనే పీఠాధిపతికి అర్హులు నేనంటే నేనంటూ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రాథమిక విచారణను మధ్యలోనే నిలిపివేశారు రాణాప్రతాప్‌.

అయితే, గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికే ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకు కనుక ఆయనకే ఇవ్వాంటున్నారు. అయితే వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండో కుమారుడి పేరు ఉంది. పెద్ద భార్య కిడ్నీ ఫెయిల్ అయిన సమయంలో ఎవరైతే కిడ్నీ ఇస్తారో తదుపరి పీఠాధిపతి వారేనని ప్రకటించారు. అప్పుడు రెండో కుమారుడు ముందుకు వచ్చాడు. దీంతో అతని పేరును వీలునామాలో రాశారు. దీంతో ఆయనకు కొందరు మద్దతు తెలుపుతున్నారు.

మరోవైపు, వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని, అయితే చిన్నవాడు కావడంతో తానే మఠాధిపత్యాన్ని స్వీకరిస్తానని చెబుతోంది చిన్న భార్య మారుతి లక్ష్మమ్మ. తన భర్త తర్వాత తనకే మఠాధిపత్యం వస్తుందని వీలునామాలో రాశారని వాదిస్తున్నారు.

Read also : India Vaccinates : దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ.. నిన్న ఒక్కరోజులోనే 85 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సినేషన్

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్