AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

amarnath yatra: నేటితో ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర.. వెండి కర్రకు పూజ.. దీని ప్రాముఖ్యత ఏమిటంటే

శివుని పవిత్ర అమర్ నాథ్ యాత్ర ను ఛదీ ముబారక్ అని కూడా అంటారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి యాత్ర ప్రారంభమైంది. ముగింపుగా వెండి కర్రను సంప్రదాయ పూజలతో యాత్రను అమర్‌నాథ్‌ గుహకు తీసుకెళ్లనున్నారు. దీనితో ప్రయాణం ముగుస్తుంది. ఒక రాత్రి బస చేసిన అనంతరం ఆదివారం ఉదయం శ్రావణ శుక్ల పక్ష చతుర్దశి సందర్భంగా శేషనాగ్ క్యాంపు నుంచి పంచతర్ణి శిబిరానికి బయలుదేరినట్లు అమర్‌నాథ్ ఆలయ సంరక్షకుడు మహంత్ దీపేంద్ర గిరి తెలిపారు.

amarnath yatra: నేటితో ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర.. వెండి కర్రకు పూజ.. దీని ప్రాముఖ్యత ఏమిటంటే
Amarnath Yatra
Surya Kala
|

Updated on: Aug 19, 2024 | 11:23 AM

Share

హిందూ మతంలోపవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర జూన్ 29, 2024 న ప్రారంభమై.. ఈ రోజు (ఆగస్టు 19, 2024)న ముగుస్తుంది. ఈ ఛదీ ముబారక్ ప్రయాణం శ్రావణ పౌర్ణమి రోజున ముగుస్తుంది. ఈ రోజున ఛదీ ముబారక్ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుంది. అమరనాథ్ పవిత్ర గుహలో ఛదీ ముబారక్ పూజతో శ్రీ అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుంది. శివుని చిహ్నమైన కర్ర శ్రీనగర్ ప్రదేశం నుంచి పహల్గాం, పంచతరిణికి తీసుకురాబడింది.

రాఖీ పండగ రోజున యాత్ర పూర్తవుతుంది

శివుని పవిత్ర అమర్ నాథ్ యాత్ర ను ఛదీ ముబారక్ అని కూడా అంటారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి యాత్ర ప్రారంభమైంది. ముగింపుగా వెండి కర్రను సంప్రదాయ పూజలతో యాత్రను అమర్‌నాథ్‌ గుహకు తీసుకెళ్లనున్నారు. దీనితో ప్రయాణం ముగుస్తుంది. ఒక రాత్రి బస చేసిన అనంతరం ఆదివారం ఉదయం శ్రావణ శుక్ల పక్ష చతుర్దశి సందర్భంగా శేషనాగ్ క్యాంపు నుంచి పంచతర్ణి శిబిరానికి బయలుదేరినట్లు అమర్‌నాథ్ ఆలయ సంరక్షకుడు మహంత్ దీపేంద్ర గిరి తెలిపారు. దీని తరువాత సాధువుల బృందంతో పాటు పవిత్ర కర్ర 14,800 అడుగుల ఎత్తులో ఉన్న మహాగున్స్ టాప్‌ను దాటింది. మహాగున్స్ టాప్ స్వామి అమర్‌ నాథుడు పవిత్ర ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఎత్తైన శిఖరం. శ్రావణ పూర్ణిమ సందర్భంగా సోమవారం ఉదయం ఛదీ ముబారక్‌ను పవిత్ర గుహలోకి తీసుకెళ్లి వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ పూజలు, ఆచార వ్యవహారాలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఛదీ ముబారక్ అంటే ఏమిటి?

ఛదీ ముబారక్ శివుని చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది మత సంప్రదాయం. ఈ వెండి కర్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కర్రలో శివుని అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ కర్రను ప్రతి సంవత్సరం అమర్‌నాథ్‌కు తీసుకురావాలనే ఆజ్ఞతో మహర్షి కశ్యపుడికి లయకారుడు శివునికి అందజేసినట్లు చెబుతారు.

అమర్‌నాథ్ గుహ ప్రాముఖ్యత

అమర్‌నాథ్ గుహ హిమాలయాల ఎత్తైన కొండలపై ఉంది. స్వయం భుగా వెలసే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో ఈ గుహకు వెళతారు. శివుడు మంచుతో శివలింగ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. మంచుతో ఏర్పడిన శివలింగం కారణంగా దీనిని బాబా బర్ఫానీ అని కూడా పిలుస్తారు. శివుని ఈ గుహ చుట్టూ హిమానీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. ఈ పవిత్ర గుహలో పరమశివుడు పార్వతిదేవికి అమరత్వాన్ని పొందే కథను వివరించాడని చెబుతారు. ఈ కథ విన్న శుక దేవుడు అమరుడయ్యాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు