AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: పిల్లల్ని తల్లిదండ్రులు ఈ నియమాల ప్రకారం పెంచితే భవిష్యత్ బంగారు బాటే అంటున్న చాణక్య

తల్లిదండ్రుల అతిపెద్ద బాధ్యత వారి పిల్లలను పెంచడం. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచితనంతో, సద్గుణవంతుడిగా ఎదగాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో తమ పిల్లలను ఎలా పెంచాలి అనే అనేక ప్రశ్నలు వారి మనస్సులోకి వస్తాయి. చాణక్య విధానాలు పిల్లల పెంపకం సందర్భంలో తల్లిదండ్రులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అతని విధానాలను అనుసరించడం ద్వారా.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చవచ్చు. ఈ రోజు మనం తల్లిదండ్రుల కోసం చాణక్య విధానాలను గురించి తెలుసుకుందాం.. వీటిని పాటించడం వలన తల్లిదండ్రులు తమ పిల్లలను జ్ఞానవంతులుగా , సంస్కారవంతులుగా చేయగలరు.

Chanakya Niti: పిల్లల్ని తల్లిదండ్రులు ఈ నియమాల ప్రకారం పెంచితే భవిష్యత్ బంగారు బాటే అంటున్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Jun 19, 2025 | 8:35 AM

Share

ఆచార్య చాణక్యుడి ప్రకారం పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తారు. భవిష్యత్తులో తమ లక్ష్యాలను సాధిస్తారు. పిల్లల పెంపకంలో ఒక చిన్న తప్పు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుందనేది తెలిసిందే. అటువంటి పరిస్థితిలో జీవితంలోని ప్రతి దశలోనూ పిల్లలకు సరైన మార్గాన్ని చూపించడం తల్లిదండ్రుల మొదటి కర్తవ్యం.

హిందూ మతంలో తల్లిని పిల్లల మొదటి గురువుగా భావిస్తారు. తల్లి పిల్లలను ప్రపంచానికి పరిచయం చేసే మొదటి వ్యక్తి. ఆపై పిల్లవాడు తండ్రిని అనుసరించడం ద్వారా మాట్లాడటం, ప్రవర్తించడం నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల సరైన, నాగరిక ప్రవర్తన పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడానికి ఇదే కారణం. ఆచార్య చాణక్యుడి విధానాలు శతాబ్దాలుగా పిల్లల పెంపకంలో ఒక మైలురాయిగా నిరూపించబడ్డాయి. కనుక ఈ రోజు మనం వాటి గురించి కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం..

భాషను జాగ్రత్తగా ఉపయోగించండి తల్లిదండ్రులకు పిల్లలు పంటల వంటివారు. తల్లిదండ్రులు రైతుల వంటివారు. రైతు తన పంటను చూసి హృదయపూర్వకంగా.. ఆత్మతో పోషించినట్లే పిల్లలను కూడా అదే విధంగా పెంచాలి. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో వారి పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. కనుక తల్లిదండ్రులు తమ భాషను, మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

ధర్మం, అధర్మం గురించి విద్యను అందించండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి తల్లిదండ్రుల విధి తమ పిల్లలకు ధర్మం, అధర్మం గురించి బోధించడం. వారికి ఏది సరైనది, ఏది తప్పు గురించి అవగాహన కల్పించండి. అప్పుడే పిల్లలు ముందుకు సాగి విజయవంతమైన వ్యక్తులు అవుతారు.

5 సంవత్సరాల వయస్సు వరకు తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే ఆచార్య చాణక్యుడు పిల్లల పెంపకాన్ని వారి వయస్సు ప్రకారం వర్గీకరించాడు. పిల్లలను 5 సంవత్సరాల వయస్సు వరకు ప్రేమ, ఆప్యాయతతో పెంచాలని ఆయన చెప్పారు. ఈ వయస్సులో పిల్లలు చాలా జిజ్ఞాస కలిగి ఉంటారు. ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కనుక పిల్లల జిజ్ఞాసను తీర్చడం తల్లిదండ్రుల విధి. ఈ వయస్సులో పిల్లలు కొంటెగా ఉంటారు. కనుక పిల్లల అల్లరిని తప్పుగా భావించే బదులు.. వారిని ప్రేమతో అర్థం చేసుకోవాలి.

ఏ వయసులో కఠినంగా ఉండాలంటే 10 నుంచి 12 సంవత్సరాల వయస్సులో పిల్లలు మొండిగా మారి, తమ ఇష్టానుసారం పనులు చేయాలనుకుంటారు. ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా ఉండాలి. ఇలా చేయకపోతే పిల్లలు దారి తప్పే అవకాశం ఉంది.

ఏ వయసులో తల్లిదండ్రులు స్నేహితులుగా మారాలంటే 16 ఏళ్ల తర్వాత పిల్లలను తిట్టకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. తల్లిదండ్రులను ఈ వయసులో తమ స్నేహితులుగా భావించి పెంచాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఈ వయసులో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే.. వారికి తెలివిగా, ఓపికగా అర్థం చేసుకునే విధంగా తప్పుని తెలియజేయాలి. పిల్లలకు సరైన మార్గాన్ని చూపించాలి.

పెద్దలను గౌరవించడం నేర్పండి పిల్లలకు ఎల్లప్పుడూ పెద్దలను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించాలి. తమ పిల్లలలో ఈ అలవాట్లను మొదటి నుండే అలవర్చడం ముఖ్యం.

మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం ప్రాముఖ్యతను, దానిని సరిగ్గా ఉపయోగించడాన్ని నేర్పిస్తే.. అప్పుడే పిల్లలు తమ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.