AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macherla EVM Destruction Case: కౌంటింగ్ పరిసరాల్లోకి కూడా వెళ్లొద్దు.. పిన్నెల్లికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు..

సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. పోలింగ్‌ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా.. పిన్నెల్లిని అరెస్ట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది..

Macherla EVM Destruction Case: కౌంటింగ్ పరిసరాల్లోకి కూడా వెళ్లొద్దు.. పిన్నెల్లికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు..
Pinnelli Ramakrishna Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 03, 2024 | 1:30 PM

Share

సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. పోలింగ్‌ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా.. పిన్నెల్లిని అరెస్ట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన టీడీపీ ఏజెంట్.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై స్టే ఇవ్వకపోతే న్యాయవ్యవస్థను హేళన చేసినట్టేనని బెంచ్ పేర్కొంది.

కాగా.. విచారణ సందర్భంగా ఈవీఎం ధ్వంసం వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తుల ఎదుట ప్రదర్శించారు. అయితే.. ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు. ఇది అధికారిక వీడియో కాదు అంటూ పిన్నెల్లి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు.

అక్కడ ఫొటోలు కూడా ఉన్నాయి అంటూ పేర్కొన్న బెంచ్.. నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని తెలిపింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీం ఆదేశించింది. పిన్నెల్లిని 6వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిన్నెల్లికి ముందస్తు ఉపశపనం కల్పించి హైకోర్టు తప్పు చేసిందని అభిప్రాయపడింది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

జూన్ 6న లిస్టయిన ఈ పెండింగ్ కేసుపై హైకోర్టు పిటిషన్‌ను త్వరగా విచారణ ముగించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అంశంతో ప్రభావితం కాకుండా కేసులోని మెరిట్స్ ప్రకారం విచారణ జరపాలని బెంచ్ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!