AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide: మితిమీరిన అభిమానం.. నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందని నిప్పంటించుకుని అభిమాని ఆత్మహత్య

తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకుల పట్ల క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వారికోసం విపరీతమైన అభిమానాన్ని చాటుకుంటారు. ఇదే క్రమంలో తమిళనాడులో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.

Suicide: మితిమీరిన అభిమానం.. నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందని నిప్పంటించుకుని అభిమాని ఆత్మహత్య
Tamilnadu Suicide
Balaraju Goud
|

Updated on: Jul 10, 2021 | 7:54 AM

Share

Man sacrifices his life after wish for DMK: తమిళనాడులో సినీ తారలు, రాజకీయ నాయకుల పట్ల క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వారికోసం విపరీతమైన అభిమానాన్ని చాటుకుంటారు. ఇదే క్రమంలో తమిళనాడులో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ, డీఎంకే మద్దతుదారుడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ విజయాన్ని సాధించిందని ఓ ఆ పార్టీ కార్యకర్త ఆలయం ముందు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈఘటన రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని 60 ఏళ్ల ఉలగానాథన్‌ ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. అయితే, ఉలగానాథన్ ఉదయం లేచి భగవంతుడిని చూడటానికి ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన శరీరానికి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ప్రజలు అతన్ని కాపాడటానికి ప్రయత్నించారు. కాని వారు అతనిని రక్షించడంలో విఫలమయ్యారు. మంటల్లో కాలిన గాయాల కారణంగా అతను మరణించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనంతరం ఆలయంలోని స్థానిక ప్రజలు ఉలగానాథన్ రాసి పెట్టుకున్న సూసైడ్ నోట్ గుర్తించారు. అందుటో అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను చూసిన జనం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్య నోట్‌లో, ఉలగానాథన్ డీఎంకే తిరిగి అధికారంలోకి రావాలని, మంత్రి సెంథిల్ బాలాజీ విజయం కోసం ప్రార్థించానని ఉద్దేశపూర్వకంగా రాశారు. తన డిమాండ్ నెరవేరితే తనను తాను త్యాగం చేస్తానని చెప్పాడు. ఇదే క్రమంలోనే కోరిన కోర్కె నెరవేరిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021 లో డీఎంకే పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. తన కోరిక నెరవేరడంతో ఉలగానాథన్ ఆత్మబలిదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన అమావాస్య దినాన్ని ఎంచుకున్నారు. ఈ రోజును తమిళులలో పవిత్రమైన రోజుగా పిలుస్తారు. రాత్రిపూట ఇంట్లో పడుకుని ఉదయం ఆలయం వెలుపల వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Suspended: మహిళా అభ్యర్థి చీర లాగిన ఘటనలో.. ఆరుగురు పోలీసు అధికారులపై వేటు.. ఇద్దరు అరెస్ట్

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై