జగన్‌పై సొంత పార్టీ పారిశ్రామికవేత్తలకు ఎందుకు కోపం?

పార్టీలో ఎంత అసంతృప్తి వచ్చినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తన అనుయాయులు, గతంలో పార్టీ కోసం కష్టపడ్డవారు ఎక్కడున్నా పిలిచి పదవులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయన మాజీ సీఎం, తన తండ్రి రాజశేఖర రెడ్డి బాటలో వెళ్తున్నారన్నది పూర్తి వాస్తవం. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది. గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు ఆయా జిల్లాల్లో భారీగానే ఖర్చుపెట్టారు. వారు […]

జగన్‌పై సొంత పార్టీ పారిశ్రామికవేత్తలకు ఎందుకు కోపం?
Follow us

|

Updated on: Sep 22, 2019 | 2:55 PM

పార్టీలో ఎంత అసంతృప్తి వచ్చినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తన అనుయాయులు, గతంలో పార్టీ కోసం కష్టపడ్డవారు ఎక్కడున్నా పిలిచి పదవులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయన మాజీ సీఎం, తన తండ్రి రాజశేఖర రెడ్డి బాటలో వెళ్తున్నారన్నది పూర్తి వాస్తవం. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది.

గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు ఆయా జిల్లాల్లో భారీగానే ఖర్చుపెట్టారు. వారు జగన్ సీఎం అయ్యాక తమకు కాస్త ఉపయోగపడతాడని, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిస్తాడని ఆశించారు. అయితే ఆ దిశగా ఆయన అడుగులు పడకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు.  ఇప్పటికే 24 మందిని టీటీడీ బోర్డులో నియమించగా అందులో కేవలం 8 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.

ఆ అసంతృప్తి అలాగే ఉండగా జగన్ పార్టీ నేతలకు మరో షాకిచ్చారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక అతిథులుగా మరో ఏడుగురికి చాన్సిచ్చారు. అందులో ఒక్కరు మినహా మిగతా వారంతా ఇతర రాష్ట్రాలవారే కావడంతో కొందరు పారిశ్రామికవేత్తలు, నాయకులు మనసులోనే మండిపోతున్నారు. పైగా తాజా నియామకాల్లో చెన్నైకి చెందిన శేఖరరెడ్డి ఉండడం రచ్చకు దారితీస్తోంది. శేఖరరెడ్డి చంద్రబాబు హయాంలోనూ టీటీడీ సభ్యుడిగా ఉన్నారు.. ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో ఆయన సభ్యత్వం  కోల్పోయారు. అలాంటి వివాదాస్పదుడికి జగన్ ఇప్పుడు ప్రత్యేక అతిథిగా టీటీడీలోకి తెచ్చారు.

గతంలో పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచిన సంగతి తెలిసిందే. వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇక వీరికి తోడు ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురికి కూడా అవకాశం కల్పించింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాకేష్ సిన్హా (ఢిల్లీ), శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవిందహరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)లను నియమించింది. వీరికి కూడా పాలకమండలి సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉండనుండగా పాలకమండలి నిర్ణయాలలో మాత్రం ఓటుహక్కు ఉండదు. తాజాగా నియమించిన ఏడుగురిలో భూమన ఒక్కరే ఏపీకి చెందినవారు. గోవింద హరి తెలంగాణవాసి.. మిగతావారంతా ఇతర రాష్ట్రాలవారే.

అయితే జగన్ సీఎం అయ్యి 6 నెలలు కూడా తిరక్కుండానే..వారు అసంతృప్తి చెందడం సరికాదని పార్టీ అగ్రనాయకత్వం చెబుతుంది. ఫ్యూచర్ బర్తీ చేయాల్సిన నామిటేడ్ పదవులు చాలా ఉన్నాయని ఖంగారుపడొద్దని చెప్తున్నారు. ఇక 150 మంది ఎమ్మెల్యేలు గెలవడం, చాలామందికి జగన్ సీఎం కాకముందే హామిలిచ్చి ఉండటంతో కొంతమేర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కానీ జగన్ కాస్త తెలివిగానే అడుగులు వేస్తూ మొగ్గ దశలనే దాన్ని తుంచేస్తున్నారు.

Latest Articles
ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..
ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి