AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

2026 టీ20 ప్రపంచకప్ నాకౌట్ దశ ప్రారంభమైంది. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. ఒకటి దక్షిణాఫ్రికా, మరొకటి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్. ఈ రెండు గండాలను టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.

IND Vs ENG: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు
Team India
Ravi Kiran
|

Updated on: Mar 04, 2026 | 12:26 PM

Share

2026 టీ20 ప్రపంచకప్ ఉత్కంఠభరితమైన నాకౌట్ దశ ఇప్పుడు ప్రారంభమైంది. అన్ని గ్రూప్‌లలో అజేయంగా నిలిచిన జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తుది సమరానికి ఒక అడుగు దూరంలో ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా మరో ఫైనలిస్ట్‌ను నిర్ణయిస్తారు .

టీమిండియా తన సెమీఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంటే, వారికి తప్పించుకోలేని రెండు అతి పెద్ద సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సవాళ్లు టీమిండియా ప్రపంచకప్ కలను నిజం చేసుకోవడంలో గణనీయమైన అడ్డంకులుగా మారవచ్చు. మొదటి సవాల్ దక్షిణాఫ్రికా జట్టు. తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటే, అది టీమిండియాకు పెద్ద ముప్పుగా మారుతుంది. 2024లో జరిగిన ఒక ఫైనల్‌లో టీమిండియాను ఓడించేంత పని చేసిన దక్షిణాఫ్రికా, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశలో కూడా టీమిండియాను దక్షిణాఫ్రికా ఓడించింది. ఫైనల్‌లో మరోసారి దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే టీమిండియాకు కష్టంగా మారవచ్చు. ఎందుకంటే గత విజయాలు, ప్రస్తుత ఫామ్ వారికి అనుకూలంగా ఉన్నాయి.

రెండో సవాల్ ఫైనల్ మ్యాచ్ వేదికకు సంబంధించినది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని తెలిస్తే టీమిండియాకే కాదు, అభిమానులకు కూడా షాక్ అవుతుంది. ఈ పిచ్ టీమిండియాకు అచ్చిరాదని గత రికార్డులు సూచిస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇదే స్టేడియంలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇది ఒక పెద్ద షాక్. ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. మళ్ళీ అచ్చిరాని ఇదే గ్రౌండ్‌లో అదే దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో తలపడటం టీమిండియాకు కలిసి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అహ్మదాబాద్ పిచ్ ప్రత్యేకంగా దక్షిణాఫ్రికాకు అనుకూలంగా ఉంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే ఈ గ్రౌండ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. అంటే, ఈ అహ్మదాబాద్ గ్రౌండ్ టీమిండియా కంటే దక్షిణాఫ్రికాకు ఒక హోమ్ గ్రౌండ్‌గా మారిపోయింది. ఈ అచ్చిరాని పిచ్‌పై దక్షిణాఫ్రికా బలమైన ఫామ్‌తో ఉండటం టీమిండియాకు ఫైనల్‌లో ఒక పెద్ద గండంగా మారనుంది. ఈ సవాళ్లను టీమిండియా ఎలా అధిగమించి ప్రపంచకప్ గెలుచుకుంటుందో వేచి చూడాలి.

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

Follow Us