PM Modi: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్.. కరోనా పరిస్థితులపై ఆరా.. తక్షణ చర్యలపై సూచనలు!

కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాకరే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్ లతో ప్రధాని మోదీ విడివిడిగా కాల్ చేసి మాట్లాడారు.

PM Modi: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్.. కరోనా పరిస్థితులపై ఆరా.. తక్షణ చర్యలపై సూచనలు!
Pm Narendra Modi Dials Four Chief Ministers To Discuss Covid Situation In Their States
Follow us

|

Updated on: May 08, 2021 | 2:54 PM

PM Modi Dials four Chief Ministers: కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాకరే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్ లతో ప్రధాని మోదీ విడివిడిగా కాల్ చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

గత మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ 10 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇద్దరు కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో సంభాషించారు.

కరోనా మహమ్మారి రెండో దశ విలయంలోనూ తీవ్ర ప్రభావానికి గురైన మహారాష్ట్రలో వైరస్ మరోసారి పంజా విసిరింది. దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 54,022 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 898 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వివరిస్తూ ప్రధానికి సీఎం ఉద్ధవ్ థాకరే లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు వినియోగిస్తున్న కోవిన్ వెబ్ సైట్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని… తమ రాష్ట్రం వరకు ప్రత్యేకమైన యాప్ ను తయారు చేసుకుంటామని కేంద్రానికి థాకరే నిన్న లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రులతో ప్రధాని ఫోన్ ద్వారా మాట్లాడటం గమనార్హం.

మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు నివారణ చర్యలపై ఆరా తీశారు. కాగా, ఈ సందర్భంగా నిరంతరం ఎంపీలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు, వేగంగా రికవరీ రేటుపై ప్రధాని మోదీకి అప్‌డేట్ చేశానని శివరాజ్ సింగ్ చెప్పారు. జనతా కర్ఫ్యూతో సహా వైరస్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన ప్రధానితో మాట్లాడారు. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్ మరో 11,708 కోవిడ్ కేసులను నమోదు కాగా, ఇప్పటివరకు మొత్తం 6.49 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారని సీఎం చౌహాన్ హిందీలో ట్వీట్ చేశారు.

అదేవిధంగా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితోనూ ప్రధాని మాట్లాడారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆసుపత్రి పడకల పరిస్థితి. టీకా డ్రైవ్ గురించి ప్రధానికి సీఎం జైరామ్ ఠాకూర్ వివరించారు. కొండ ప్రాంత రాష్ట్రంలో శుక్రవారం 4,177 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.22 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 56 మంది కోవిడ్ బారినపడి మరణించారు. వైరస్‌పై పోరాటంలో రాష్ట్రానికి సాధ్యమైనంత సహాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఠాకూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్చలపై ఆరా తీశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఆక్సిజన్ అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదిలావుంటే, ఈ వారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో ప్రధాని మోదీ చేసిన ఫోన్ కాల్ ట్వీట్‌లో ప్రధానిపై సోరెన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. దేశంలోని కోవిడ్ -19 పరిస్థితిపై పీఎం మోదీ తనకు చేసిన ఫోన్ కాల్‌ను పిలుపును వ్యాపారానికి బదులుగా ప్రధాని ” మన్ కి బాత్ ” గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చేసిన విమర్శలను ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. సోరేన్ వ్యాఖ్యలపై దేశంలో మరే ఏ ముఖ్యమంత్రి ఖండించకపోయినా ఏపీ సీఎం జగన్ స్పందించారు. Read Also…. Tamil Nadu: ఓటమిని జీర్ణించుకోకముందే కమల్‌హాసన్‌కు బిగ్ షాక్.. పార్టీకి నేతలు గుడుబై… ( వీడియో )

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు