AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి

ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి, దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైయస్‌ షర్మిల ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు కొత్త పుంతలు..

వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 12:45 PM

Share

ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి, దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైయస్‌ షర్మిల ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇంతకాలం సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు.. బండి సంజయ్‌ రాకతో గాలి బీజేపీ వైపు మళ్లినట్లు కనిపించింది. తాజాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల ఎంట్రీతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయాయి. తెలంగాణలో ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిలతో లోటస్‌ పాండ్‌ కేంద్రంగా వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున వైయస్‌ అభిమానులు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే.. వైఎస్ జయంతి రోజున కానీ.. వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కానీ పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని షర్మిల టీం అంచనా వేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఫక్తు సమైక్య వాదం వినపించిన షర్మిల.. తెలంగాణకు బద్ధ విరోధి అయిన వైఎస్సార్ కుమార్తె.. రాజకీయంగా ఆదరణ ఉండదన్న విమర్శలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కొట్టి పడేశారు. లోటస్‌పాండ్‌లో షర్మిలతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. ఆమెకు రాజకీయంగా ఆదరణ ఉండదన్న అంచనాలు తలక్రిందులవడం ఖాయమన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు ఎవరి సొత్తు కాదని మాగం రంగారెడ్డి అన్నారు. షర్మిల కొత్త పార్టీని తాను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని.. తెలంగాణలో పని చేసేందుకు వస్తున్నమహిళల్ని ప్రజలు స్వాగతించాలని కోరారు. దేశంలో ఎక్కడ పుట్టినా.. ఎక్కడైనా పని చేయొచ్చని.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత స్వస్థలం కేరళ అని గుర్తు చేశారు. షర్మిల హైదరాబాద్‌లోనే పుట్టారని ఆమె తెలంగాణ బిడ్డే అని రంగారెడ్డి గుర్తు చేశారు.

Read more:

బాసర సరస్వతి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ.. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పోటెత్తిన భక్తులు