మోదీకి బాబు థ్యాంక్స్..స్నేహ హస్తానికి సంకేతమా..?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. అయితే అది ఏ ఇష్యూలో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల కేంద్రం రిలీజ్ చేసిన నేషనల్ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతి మిస్సయిన విషయం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో క్వచ్ఛన్ రైజ్ చేశారు. దీంతో అలర్టయిన కేంద్ర హోంశాఖ.. అమరావతిని ఏపీ రాజధానిగా చేర్చి నయా మ్యాప్ విడుదల చేసింది. దీనిపై టీడీపీ అధినేత […]

మోదీకి బాబు థ్యాంక్స్..స్నేహ హస్తానికి సంకేతమా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 3:45 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. అయితే అది ఏ ఇష్యూలో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల కేంద్రం రిలీజ్ చేసిన నేషనల్ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతి మిస్సయిన విషయం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో క్వచ్ఛన్ రైజ్ చేశారు. దీంతో అలర్టయిన కేంద్ర హోంశాఖ.. అమరావతిని ఏపీ రాజధానిగా చేర్చి నయా మ్యాప్ విడుదల చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోమంత్రి అమిత్ షా, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలకు లేఖలు రాశారు. అందులో మోదీకి స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.

మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి మ్యాప్‌లో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆందోళనకు గురయ్యారని ఆయన లేఖలో ప్రస్తావించారు. టీడీపీ ఎంపీలు సమస్యను ప్రస్తావించిన వెంటనే స్పందించినందుకు చంద్రబాబు.. కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో విబేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ వ్యతిరేక కూటమి కట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచారు. పలు రాష్ట్రాల్లో బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా..ఏపీ ఎన్నికల సమయంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోసం చేసిందంటూ ఫైరయ్యారు. కానీ ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. బీజేపీ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా బంఫర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఇక అప్పట్నుంచి బాబు సైలెంట్ అయ్యారు. ఇటీవల కొన్ని వేదికల్లో రాష్ట్ర హక్కుల కోసమే మోదీతో విబేధించానని, ఆయనతో తన ఎటువంటి కక్షలు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోదీకి బాబు థ్యాంక్స్ చెప్పడం చూస్తుంటే..బాబు, బీజేపీతో స్నేహ హస్తం అందుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్