AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌, జగన్‌లపై చంద్రబాబు విమర్శలు

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  టీడీపీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ బెదరిస్తోందని.. కేసీఆర వ్యవహార శైలి మారకుంటే హైదరాబాద్‌లో ఆందోళన చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా తెలంగాణ సీఎం వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అన్నారు. టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఏపీపై జరుగుతున్న కుట్రలను ఛేదిచేందుకు ప్రజల మద్దతు కూడగట్టాలని బాబు సూచించారు. […]

కేసీఆర్‌, జగన్‌లపై చంద్రబాబు విమర్శలు
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2019 | 9:16 PM

Share

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  టీడీపీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ బెదరిస్తోందని.. కేసీఆర వ్యవహార శైలి మారకుంటే హైదరాబాద్‌లో ఆందోళన చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా తెలంగాణ సీఎం వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అన్నారు. టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఏపీపై జరుగుతున్న కుట్రలను ఛేదిచేందుకు ప్రజల మద్దతు కూడగట్టాలని బాబు సూచించారు.  వైసీపీ అగ్రనేతలే స్వయంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. వాటిని ఆధారాలతో సహా బయటపెట్టాలని సూచించారు.  రాష్ట్రానికి అతి పెద్ద సమస్య జగనేనని, ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవాలని చెప్పారు. విభేదాల్లేకుండా పని చేసి…పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని…ఆ తర్వాత అందరి సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు పార్టీ నాయకులకు హితభోద చేశారు.