అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పాత బస్టాండ్ వద్ద అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక్క రాత్రిలో నాలుగు దుకాణాలను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడ్డారు. నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులతో పరారయ్యారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పట్టణంలో వీధిలైట్లు లేకపోవడం దొంగలకు అనుకూలంగా మారిందని తెలిసింది.