AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం..

చంద్రబాబువి బురద రాజకీయాలని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో బాధితులను ఆదుకోవడానికి కనీసం నెల పట్టలేదని.. ఇప్పుడు వారంలోనే సాయం చేశామన్నారు.

CM Jagan: ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 29, 2021 | 6:02 PM

Share

CM Jagan – ChandraBabu: చంద్రబాబువి బురద రాజకీయాలని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో బాధితులను ఆదుకోవడానికి కనీసం నెల పట్టలేదని.. ఇప్పుడు వారంలోనే సాయం చేశామన్నారు. హుధుద్‌లో రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెబితే.. ఇచ్చింది రూ.550 కోట్లేనని గుర్తు చేశారు. అదంతా కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చిందన్నారు. 22 వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన ఆ పెద్ద మనిషి.. ఇచ్చింది రూ.550 కోట్లని తప్పుబట్టారు. కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని ఇంతవేగంగా అందిస్తే.. దానిపైనా బురద జల్లుతున్నారని చంద్రబాబు తీరును తప్పుబట్టారు సీఎం జగన్‌.

అయితే బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామన్నారు. గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని.. గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని విమర్శించారు.

అలాంటిది ఇవాళ వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లు.. ఇప్పుడు మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామని.. గతంలో ఎప్పుడూ కూడా ఇలా చేయలేదన్నారు.

చంద్రబాబు ఉన్న సమయంలో సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన రైతులకు సహాయం చేసిన దాఖలాలు లేవని.. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసినట్లుగా చెప్పారు. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.

గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేదని.. ఆతర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే మనం అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.6వేల కోట్లు నష్టం జరిగితే.. ఇచ్చింది రూ.34 కోట్లే అని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబును పరోక్షంగా విమర్శించారు.

జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు రూపేణా..  30శాతానికిపైగా పంటరూపేణా, సుమారు 18శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం రూపేణా జరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి: Omicron Variant: ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. అసలు ఇది ప్రాణాంతకమా? కాదా?..

Telangana: శివాలయంలో అద్భుతం… చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు