ఆరుగురు పోలింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు పోలింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఘటన ఒడిషా రాష్ట్రంలోని బారఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. బారఘడ్ జిల్లాలో రెండో దశ పోలింగ్ పర్వంలో ఆరుగురు పోలింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. దీంతో ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు, ముగ్గురు సెక్టార్ అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన పోలింగ్ అధికారుల్లో ఉమాశంకర్ పాణిగ్రాహి, రోషన్ సేథి, ప్రియబ్రత […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు పోలింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఘటన ఒడిషా రాష్ట్రంలోని బారఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. బారఘడ్ జిల్లాలో రెండో దశ పోలింగ్ పర్వంలో ఆరుగురు పోలింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. దీంతో ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు, ముగ్గురు సెక్టార్ అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన పోలింగ్ అధికారుల్లో ఉమాశంకర్ పాణిగ్రాహి, రోషన్ సేథి, ప్రియబ్రత సాహు, ప్రశాంత్ సేథి, ఉమాశంకర్, ప్రదీప్ ప్రధాన్లు ఉన్నారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేర జిల్లా కలెక్టర్ సదరు అధికారులపై ఈ చర్య తీసుకున్నారు.