PM Modi: నరేంద్ర మోడీ.. ‘ది బాస్’.. ప్రశంసలతో ముంచెత్తిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీకి విశేష ఆదరణ లభించింది. బుధవారం కూడా ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. దీంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై కూడా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో చర్చించనున్నారు.

| Edited By: Ravi Kiran

Updated on: May 24, 2023 | 11:22 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీకి విశేష ఆదరణ లభించింది. బుధవారం కూడా ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. దీంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై కూడా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో చర్చించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీకి విశేష ఆదరణ లభించింది. బుధవారం కూడా ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. దీంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై కూడా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో చర్చించనున్నారు.

1 / 7
మంగళవారం సిడ్నీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్.. పరిచయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీని ది బాస్ అని సంబోధిస్తూ ప్రశంసలు కురించారు.

మంగళవారం సిడ్నీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్.. పరిచయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీని ది బాస్ అని సంబోధిస్తూ ప్రశంసలు కురించారు.

2 / 7
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతీయులను ఆస్ట్రేలియా వాసులు అక్కున చేర్చుకున్నారని.. ఇరు దేశాలకు విడదీయలేని అనుబంధం ఉందంటూ పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అన్నారు. ఆ తర్వాత 3 డీలు డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీలు ఉన్నాయని.. ఇరు దేశాల మధ్య యోగా బంధం కూడా ఉందన్నారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతీయులను ఆస్ట్రేలియా వాసులు అక్కున చేర్చుకున్నారని.. ఇరు దేశాలకు విడదీయలేని అనుబంధం ఉందంటూ పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అన్నారు. ఆ తర్వాత 3 డీలు డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీలు ఉన్నాయని.. ఇరు దేశాల మధ్య యోగా బంధం కూడా ఉందన్నారు.

3 / 7
సిడ్నీ.. వసుదైక కుటుంబం అన్నదే భారత్ నినాదమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలబడుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందన్నారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారన్నారు.

సిడ్నీ.. వసుదైక కుటుంబం అన్నదే భారత్ నినాదమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలబడుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందన్నారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారన్నారు.

4 / 7
వంద దేశాల‌కు పైగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి వందల కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడమని ప్రధాని గుర్తు చేశారు.. ప్రపంచం వసుదైక కుటుంబం అనే భావ‌న‌ను భార‌త్ విశ్వసిస్తుందని.. అందుకే అన్ని దేశాలకు స‌హాయ, సంక్షేమ కార్యక్రమాలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.

వంద దేశాల‌కు పైగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి వందల కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడమని ప్రధాని గుర్తు చేశారు.. ప్రపంచం వసుదైక కుటుంబం అనే భావ‌న‌ను భార‌త్ విశ్వసిస్తుందని.. అందుకే అన్ని దేశాలకు స‌హాయ, సంక్షేమ కార్యక్రమాలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.

5 / 7
ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా వాసులు సహృదయులు, విశాల హృదయులని ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్టేడియం మోడీ.. మోడీ అన్న నినాదాలతో దద్దరిల్లింది.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా వాసులు సహృదయులు, విశాల హృదయులని ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్టేడియం మోడీ.. మోడీ అన్న నినాదాలతో దద్దరిల్లింది.

6 / 7
ఇదిలాఉంటే.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా మొత్తం.. మోడీ పైనే ఫోకస్ పెట్టింది. ప్రధాని మోడీ ప్రముఖుల భేటీ నుంచి ద్వైపాక్షిక చర్చల వరకు.. అన్నింటిని ప్రధాన పత్రికలన్ని మొదటి పేజీల్లో ప్రచురించాయి.

ఇదిలాఉంటే.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా మొత్తం.. మోడీ పైనే ఫోకస్ పెట్టింది. ప్రధాని మోడీ ప్రముఖుల భేటీ నుంచి ద్వైపాక్షిక చర్చల వరకు.. అన్నింటిని ప్రధాన పత్రికలన్ని మొదటి పేజీల్లో ప్రచురించాయి.

7 / 7
Follow us