PM Modi in US Congress: భారత్ అభివృద్ధి యావత్ ప్రపంచం అభివృద్ధి.. యూఎస్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండోసారి అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ప్రధాని.
Updated on: Jun 23, 2023 | 7:54 AM

అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండోసారి అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు ప్రధాని.

భిన్నత్వంలో ఏకత్వానికి భారత్-అమెరికా దేశాలు ప్రతీక అని అని చెప్పారు ప్రధాని మోదీ. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే అని, అమెరికాలో 40 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులను చూసి గర్వంగా ఉందన్నారు మోదీ. ప్రపంచశాంతి కోసం భారత్-అమెరికాలు కృషి చేస్తునట్టు తెలిపారు. భారత్ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అని పేర్కొన్నారు పీఎం మోదీ.

వైట్హౌస్లో, అమెరికన్ కాంగ్రెస్ కాన్సులేట్లో తనకు లభించిన ఘనస్వాగతం 140 కోట్ల మంది భారతీయుకులకు గర్వకారణం అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఈ సన్మానం అమెరికాలో ఉన్న 40 లక్షల మంది ప్రవాస భారతీయులకు కూడా వర్తిస్తుందన్నారు. ప్రెసిడెంట్ జో బైడెన్కు, జిల్ బైడెన్కు ధన్యవాదాలు తెలిపారు పీఎం మోదీ.

ఈ సందర్భంగా మోదీ ప్రసంగించగా.. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు కరతాల ధ్వనులతో ఆయనను అభినందించారు. మోదీ ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా విన్న సభికులు.. 15సార్లు లేచి నిలబడి అభినందించగా.. 79 సార్లు చప్పట్లతో అభినందించారు.

మోదీ తనకు మంచిమిత్రుడని అన్నారు బైడెన్. భారత్-అమెరికా మైత్రీబంధం 21వ శతాబ్ధానికి చాలా ముఖ్యమన్నారు. భారత్ అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాలు రెండు దేశాలకే కాదు ప్రపంచానికి కూడా చాలా ముఖ్యమన్నారు బైడెన్. ఇవి తరతరాల పాటు ఉంటాయన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా, సాంకేతికపరంగా ఎన్నో మార్పుల వచ్చినప్పటికీ ఇవి నిలిచిపోతాయని పేర్కొన్నారు.

కాగా, బైడెన్-మోదీ భేటీలో దౌత్యపరమైన విషయాలతో పాటు రక్షణరంగం, వాణిజ్యరంగానికి చెందిన ఒప్పందాలపై కూడా చర్చించారు. పేదరిక నిర్మూలను, పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
