మువ్వన్నెల జెండాలోని ప్రతి రంగుకు అర్థం ఏమిటి?
ఇంకో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజున నా దేశం, నా జెండా.. భారత జాతీయ పతాకాన్ని చూసినా సరే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది. మరి మువ్వన్నెల జెండాలోని ప్రతి రంగుకు అర్థం ఏమిటి? దీని పరిమాణం ఎంత తీసుకోవాలి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా..
Updated on: Aug 08, 2025 | 10:04 PM

అలాంటి మువ్వన్నెల జెండాను మన తెలుగువారు పింగళి వెంకయ్య రూపొందించటం మనకు గర్వకారణం. 1916లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను తొలిసారి ఎగురవేత.

మన జాతీయ జెండాను స్వాతంత్ర్యం వచ్చాక.. జూలై 22, 1947న భారత రాజ్యాంగం కూడా ఆమోదించింది. జాతీయ జెండాలో కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల మధ్య రాట్నం చిత్రించమని సూచించిన మహాత్మ గాంధీ.

భారతదేశ త్రివర్ణ పతాకం లాగా జెండాలోని రంగు నుండి చిహ్నం వరకు ప్రతిదానికీ స్వంతహా ప్రత్యేక అర్థం ఉంటుంది. త్రివర్ణ పతాకంలో, పైభాగంలోని చార కాషాయ రంగులో, మధ్యభాగంలోని తెలుపు రంగులో.. కింది భాగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

కాషాయ రంగు బలం, ధైర్యాన్ని, త్యాగాన్ని సూచిస్తుంది. తెల్లటి రంగు పవిత్రత, శాంతి, సత్యాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు విశ్వాసానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచాయి. సారనాధ్ స్థూపంలోని అశోకుని ధర్మచక్రం భారతీయులు ధర్మమార్గాన పయనించాలని సందేశం ఇస్తోంది.

భారతీయ త్రివర్ణ పతాకంలోని 24 చువ్వలు ధర్మచక్రం, న్యాయం, స్వయంగా తిరుగుతూ.. కాల చక్రంలా తన చలనాన్ని పూర్తి చేసి, మళ్లీ తన గమనాన్ని ప్రారంభించేంది అని దీని అర్థం. త్రివర్ణ పతాకాన్ని ఏ విధంగానూ తయారు చేయలేము. దాని పరిమాణం స్థిరంగా ఉంటుంది. భారత జాతీయ జెండా వెడల్పు-పొడవు నిష్పత్తి 2:3.




