భారతదేశపు మొట్టమొదటి కంపెనీ ఏ పని చేసింది? ఇది తెలిస్తే షాక్..
నేడు భారతదేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయి. ఇవి దేశ పురోగతి, అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ మొదటి భారతీయ కంపెనీ ఏది? అది ఏమి పని చేసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సందేహం మీ చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.
Updated on: Aug 08, 2025 | 10:14 PM

నేడు భారతదేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయి. ఇవి దేశ పురోగతి, అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ మొదటి భారతీయ కంపెనీ ఏది? అది ఏమి పని చేసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సందేహం మీ చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

భారతదేశంలో మొట్టమొదటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1600 లో బ్రిటన్లో స్థాపించిన ఈ కంపెనీ, భారతదేశంలో వ్యాపారం చేసిన మొదటి వ్యవస్థీకృత కంపెనీ. ఈ కంపెనీ భారతదేశంలో మైనింగ్ నుండి రైల్వేల వరకు ప్రతిదీ చేయడం ప్రారంభించింది.

ఈ కంపెనీకి సూరత్లో మొదటి కర్మాగారాన్ని స్థాపించడానికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతి ఇచ్చాడు. ఆ కంపెనీ తన వ్యాపారాన్ని కలకత్తా నుండి ప్రారంభించి, తరువాత చెన్నై-ముంబై వరకు విస్తరించింది.

దీని సృష్టి వెనుక కారణం బ్రిటిష్ సామ్రాజ్యవాదం. వలసరాజ్యాలను ప్రోత్సహించడం. ఇదే కంపెనీ భారతదేశంపై బానిసత్వ సంకెళ్లను కూడా వేసింది. 1857 వరకు, ఈ కంపెనీ కంపెనీ రాజ్ పేరుతో భారతదేశాన్ని పరిపాలించింది.

1857 తిరుగుబాటు తరువాత, బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశ పాలనను కంపెనీ నుండి తీసుకుంది. ఆ తర్వాత ఈ కంపెనీ బ్రిటిష్ నేతృత్వంలో పని చేసింది. 1947లో దేశానికీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కంపెనీ పూర్తిగా మూతపడింది.




