AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. సీసీటీవీలో దొరికిపోయిన తాగుబోతు వ్యాపారి! ఏం చెబుతున్నాడంటే..

వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచూ రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి లక్ష్యంగా మారింది. మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన సంచలనం సృష్టించింది. ఈ మొత్తం దృశ్యం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. సీసీటీవీలో దొరికిపోయిన తాగుబోతు వ్యాపారి! ఏం చెబుతున్నాడంటే..
Stone Pelting On Vande Bharat
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2026 | 8:43 AM

Share

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి లక్ష్యంగా మారింది. మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన సంచలనం సృష్టించింది. అయితే, నిందితుడి అతి తెలివి సీసీటీవీ కెమెరా ముందు సాగలేదు. నిందితుడు కల్యాణ్ ప్రాంతంలో పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తిగా గుర్తించారు. ఘటన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ట్రాక్ పక్కన నిలబడి ఉన్న అతను, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక రాయిని రైలు వైపు విసిరాడు. ఈ దాడిలో రైలులోని ఒక కిటికీ అద్దం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.

రైల్వే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుడు రాయి విసురుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆ ఆధారంతో రైల్వే రక్షణ దళం (RPF), స్థానిక పోలీసులు గాలింపు చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతను మద్యం మత్తులో ఆ పని చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిపై రైల్వే చట్టం సెక్షన్ 154 (ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడం) కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం నేరమని, దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!