AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. ఒకేసారి ఐదు పథకాలు.. పండుగే.. పండుగ..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో ప్రధానంగా ఐదు పథకాల ద్వారా భారీ ప్రయోజనం పొందవచ్చు. పీఎం కిసాన్ పథకం గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా రూ.6 వేలు నేరుగా అకౌంట్లో పొందవచ్చు.

Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. ఒకేసారి ఐదు పథకాలు.. పండుగే.. పండుగ..
Farmers
Venkatrao Lella
|

Updated on: Aug 16, 2026 | 2:52 PM

Share

దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటి ద్వారా దేశంలోని ప్రతీఒక్క రైతు ప్రయోజనం పొందవచ్చు. కానీ చాలామందికి వీటి గురించి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నేరుగా నగదు అందించడంతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంటకు బీమా వంటి పథకాలు అమలు చేస్తోంది. ఈ ప్రయోజనాలను అందుకోవడం వల్ల భారీగా డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. ప్రధానంగా రైతుల కోసం 5 పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన పథకం పీఎం కిసాన్. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది రైతులకు రూ.6 వేల చొప్పున కేంద్రం అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా జమ చేస్తోంది. 5 ఎకరాల్లోపు పోలం కలిగి ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు. భూమి రికార్డులు మీ పేరు మీద ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది.

పంట బీమా పథకం

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు సాగు చేసే పంటలకు కేంద్రం బీమా సౌకర్యం కల్పిస్తోంది. కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, క్రిమికీటకాల వల్ల పంటకు నష్టం జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందిస్తాయి. వడగళ్లు, వరదలు, వర్షాలు, కరువు, తెగుళ్లు, క్రిమికీటకాలు వంటి పరిస్థితుల వల్ల పంటకు నష్టం జరిగితే బీమా సొమ్ము అందుతుంది. నష్టం జరిగిన వెంటనే స్థానిక వ్యవసాయ అధికారి లేదా బీమా కంపెనీకి తెలపాలి,

కేంద్రం నుంచి రాయితీలు

ఇక బిందు సేద్యం, స్ప్రింక్లర్ వ్యవస్థలు,సూక్ష్మ సేద్యం వంటి సాంకేతికతలను అవలంబించే రైతులకు కేంద్రం రాయితీలను అందిస్తోంది. వీటి వల్ల పంట దిగబడి పెరగడమే కాకుండా నీరు ఆదా అవుతుంది.

భూసార పరీక్షలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తాయి. దీని వల్ల మీ పంట భూమి సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ఏయే పంటకు భూమి అనుకూలంగా ఉందనే విషయాలు తెలుసుకోవచ్చు. మీ నేల ఆరోగ్యాన్ని ఈ వివరాల ద్వారా మెరుగుపపర్చుకోవచ్చు. ఏయే ఎరువులు వేయాలో.. ఏ పోషకాలు లోపించాయనేది తెలుసుకోవచ్చు.

వ్యవసాయ యంత్రాలపై రాయితీ

ఇక వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై రాయితీ పొందవచ్చు. ట్రాక్టర్లు, త్రెషర్లు, రీపర్లు, పవర్ టిల్లర్ల వంటి యత్రాల కొనుగోలపై రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Follow Us
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..
కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..
కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా
కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా
వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ..
వార్నీ.. ఒకే దేశంలో 20 లక్షలకు పైగా సరస్సులా.. ఈ అద్భుతం ఎక్కడ..
తిరుమలలో సులభంగా రూమ్స్ పొందటం ఎలా..?
తిరుమలలో సులభంగా రూమ్స్ పొందటం ఎలా..?
సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు..
సూర్యాస్తమయం తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయవచ్చా? శాస్త్రాలు..
ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి..
ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి..
వర్షాకాలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి