Cardamom: యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే.. చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం..!
ప్రతి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి. యాలకులు ఎంతో సువాసన కలిగి ఉంటాయి. వాటి వాసన, సుగుణాల వల్ల మసాలా టీ నుంచి మొదలుకుని బిర్యానీల వరకు వాడతారు. అయితే వంటల్లోనే కాకుండా వాటికున్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల చర్మ సౌందర్యానికి అవి సాయపడతాయి. వాటిని మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ముఖ సౌందర్యం కోసం యాలకులను ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..
Jyothi Gadda | Edited By: Ravi Kiran
Updated on: Oct 10, 2024 | 10:30 PM

చర్మం మృదువుగా ఉండాలంటే యాలకులతో ఫేస్ స్క్రబ్ ఎంతో మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఒక స్పూన్ యాలకల పొడి, ఒక స్పూన్ తేనె, టీ స్పూన్ చక్కెర తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ను ముఖం, మెడ భాగాల్లో రాసుకొని స్మూత్గా మర్దనా చేసుకోవాలి. పది నిమిషాలు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా మీ ఫేస్లో మంచి గ్లో కనిపిస్తుంది.

యాలకులతో పెదాల అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మీ పెదాలు గులాబీ రేకుల వలే అందంగా మెరుస్తూ ఉండాలంటే యాలకుల పొడితో ఇంకా కొన్ని పదార్థాలు కలుపుకొని మర్దన చేయాలి. దీని కోసం యాలకుల పొడి, షుగర్, తేనె కలుపుకొని పెదాలపై రాసుకోవాలి. దీని వల్ల పెదాలపై ఉన్న నల్ల మరకలు సులువుగా తొలిగిపోతాయి. దీనిని ప్రతిరోజు లిప్ బామ్గా వాడుకోవచ్చు.

మీ చర్మాని ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇందుకోసం యాలకుల ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. దీని కోసం ముందుగా కావాల్సినంత యాలకుల పొడిని తీసుకుని అందులో రెండు చెంచాల తేనె కలుపుకోవాలి. ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసుకుని వాడుకోవటం వల్ల ఇది మీ పెదాలు, చర్మాన్ని మాయిశ్చరైజర్ చేస్తాయి. చలికాలంలో ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల పెదాలు పగలకుండా కూడా ఉంటుంది.

యాలకుల పొడి, పసుపు, నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ను ఫేస్కి అప్లై చేసిన తరువాత పావుగంట పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి. చర్మంలో మార్పు కనిపిస్తుంది.

సాధారణంగా యాలకులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ సున్నిత చర్మం కలిగిన వారు మాత్రం ఒకసారి టెస్ట్ చేసుకోవటం మంచిది. చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడాలి. దురద, మంట, దద్దుర్లు, చర్మం ఎరుపెక్కడం లాంటివి అనిపిస్తే వెంటనే కడిగేసుకోండి. అలాగే ఎక్కువ మోతాదులో యాలకులను వాడితే చర్మం పొడిగా మారిపోతుంది. కాబట్టి తగినంత మాత్రమే వాడాలి.





























