- Telugu News Photo Gallery These places in Mysore are super during the monsoon season, a paradise for photographers
Mysore: వర్షంలో ఈ మైసూర్ ప్రదేశాలు సూపర్.. ఫోటోగ్రాఫర్లకు స్వర్గధామాలు..
మైసూర్ నగరం సాంప్రదాయ ఆచారాలతో పాటు చారిత్రక ప్రదేశాలు, నిర్మాణ వైభవం రెండింటినీ కలిగి కర్ణాటక సాంస్కృతిక కేంద్రంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో మైసూరు ఒక అద్భుతంలా కనిపిస్తుంది. వర్షాకాలంలో నగరం సహజంగానే రూపాంతరం చెందుతుంది. ఇది ఫోటోగ్రాఫర్లను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. మైసూరులోని రుతుపవనాల సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఉత్తమ ప్రదేశాలు ఏంటి.? ఈరోజు చూద్దాం..
Updated on: Jul 07, 2025 | 4:00 PM

మైసూరు ప్యాలెస్: భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో మైసూరు ప్యాలెస్ కూడా ఒకటి. అయితే వర్షాకాలం దాని సహజ వైభవాన్ని పెంచుతుంది. మైసూరు ప్యాలెస్ చుట్టూ ఉన్న తోట దాని పచ్చని ఆకుల కారణంగా ఉత్సాహంగా మారుతుంది. ప్రతిబింబించే కొలనులు ఈ రాజ నిర్మాణన్నీ పరిపూర్ణగా ప్రదర్శిస్తాయి. వర్షపు చినుకులతో తడిచిన ప్యాలెస్ అందాలను మీ కెమెరాలో బందించి పదిలంగా దాచుకోవచ్చు.

బృందావన్ గార్డెన్స్: మైసూరులోని కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట ప్రాంతంలో బృందావన్ గార్డెన్ ఉంది. ఇది వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో ప్రవహించే ఫౌంటెన్లు పుష్పగుచ్ఛాలు, ఆకుపచ్చ పచ్చిక బయళ్లతో కలిసి అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఫోటోషూట్ కోసం బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు మంచి ఫోటోలు తీసుకోవచ్చు.

చాముండి కొండ: చాముండి కొండపై ఉన్న చాముండేశ్వరి ఆలయం సందర్శకులకు మైసూరు శిఖరానికి చేరుకునేటప్పుడు అద్భుతమైన దృశ్యాలను చూడటానికి వీలు కల్పిస్తుంది. వర్షాకాలం కొండను ఉత్సాహభరితమైన ప్రకృతి దృశ్యంగా మారుస్తుంది. వాతావరణాన్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది. ఇది ప్రకృతి దృశ్యాల ఫోటోగ్రాఫింగ్కు అనువైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఆలయ రహదారిలో పొగమంచుతో నిండిన చెట్లతో కప్పబడిన వంపులు ఇవి ఫోటోగ్రాఫర్లకు మాయా సౌందర్యాన్ని సృష్టిస్తాయి. ఫోటోగ్రాఫర్లు తెల్లవారుజామున చాముండి కొండపై అద్భుతమైన ఫోటోలు పొందవచ్చు.

లలిత మహల్ ప్యాలెస్: లండన్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ తర్వాత వాస్తుశిల్పులు రూపొందించిన ఈ అద్భుతమైన ప్యాలెస్ మైసూరు రాజ చరిత్రను సజీవంగా దాచుకుంది. వర్షాకాలంలోలలిత మహల్ ప్యాలెస్ అద్భుతంగా కనిపిస్తుంది. వలస భవనాలు చుట్టూ వర్షపు నీరుతో ఉన్న ఆకులు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లును ఆకర్షిస్తాయి. మాన్సూన్ టైంలో ఇక్కడ తీసుకొన్న ఫోటోలు చిరకాలం నిలిచిపోతాయి.

కరంజి సరస్సు: ఇది చాముండి కొండ దిగువన ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఇది వర్షాకాలంలో స్వర్గాన్ని తలపిస్తుంది. ఈ ప్రదేశంలో పడవ ప్రయాణం అద్భుత అనుభూతి కలిగిస్తుంది. ఇది ఫోటోగ్రాఫర్లకు విభిన్న ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. సీతాకోకచిలుకల ఉద్యానవనం, పక్షుల సంరక్షణ కేంద్రం ఒకదానికొకటి ఆకర్షణీయమైన ఫోటోలను అందిస్తాయి. సీతాకోకచిలుకలు తడిసిన పూల మధ్య ఎగురుతు ఆకట్టుకుంటాయి. మాన్సూన్ సీజన్లో ఇక్కడ వలస పక్షుల ఫోటోలను మీ కెమెరాలో బంధించవచ్చు. ఇక్కడ తెల్ల నెమలి ప్రత్యేక ఆకర్షణ.




