AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: ప్రజల సందర్శనార్ధం బంగారు రామాయణం.. కోట్లు విలువజేసే ఈ పుస్తకం స్పెషాలిటీ ఏమిటంటే..

శ్రీ రామ నవమి ఇక్కడ వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే ఇక్కడ బంగారం, వెండి, విలువైన వజ్రాలు , పచ్చలు వంటి వాటితో తయారు చేసిన రామాయణం ప్రజల సందర్శనార్ధం ఏర్పాట్లు చేస్తారు.   గుజరాత్ లోని ప్రముఖ నగరం సూరత్ లో  ప్రజల దర్శనం కోసం బంగారు-వెండి రామాయణం ఏర్పాటు చేయబడింది.

Surya Kala
|

Updated on: Mar 31, 2023 | 10:44 AM

Share
శ్రీ రామ నవమి ఇక్కడ వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే ఇక్కడ బంగారం, వెండి, విలువైన వజ్రాలు , పచ్చలు వంటి వాటితో తయారు చేసిన రామాయణం ప్రజల సందర్శనార్ధం ఏర్పాట్లు చేస్తారు.   గుజరాత్ లోని ప్రముఖ నగరం సూరత్ లో  ప్రజల దర్శనం కోసం బంగారు-వెండి రామాయణం ఏర్పాటు చేయబడింది.

శ్రీ రామ నవమి ఇక్కడ వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే ఇక్కడ బంగారం, వెండి, విలువైన వజ్రాలు , పచ్చలు వంటి వాటితో తయారు చేసిన రామాయణం ప్రజల సందర్శనార్ధం ఏర్పాట్లు చేస్తారు.   గుజరాత్ లోని ప్రముఖ నగరం సూరత్ లో  ప్రజల దర్శనం కోసం బంగారు-వెండి రామాయణం ఏర్పాటు చేయబడింది.

1 / 9
 ఈ రామాయణం 222 తులాల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు, పచ్చలు ఇతర విలువైన రత్నాలతో తయారు చేయబడింది. ఈ బంగారు రామాయణాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీ రామ నవమి సందర్భంగా ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు. తర్వాత దీనిని తిరిగి బ్యాంకులో ఉంచుతారు.

ఈ రామాయణం 222 తులాల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు, పచ్చలు ఇతర విలువైన రత్నాలతో తయారు చేయబడింది. ఈ బంగారు రామాయణాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీ రామ నవమి సందర్భంగా ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు. తర్వాత దీనిని తిరిగి బ్యాంకులో ఉంచుతారు.

2 / 9
రామాయణం సనాతన హిందూ ధర్మంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప గ్రంథంగా ప్రపంచ వ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది. వాల్మీకి నుండి తులసీదాసు వరకు చాలా మంది తరతరాలుగా తమదైన రీతిలో రామాయణాన్ని రచించారు. అయితే 1977లో రాంభాయ్ గోకల్‌భాయ్ రామాయణాన్ని చాలా విశిష్టంగా రాశారు. ఈ రామాయణ పుస్తకం బంగారం, 10 కిలోల వెండి, నాలుగు వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, విలువైన ముత్యాలు , నీలమణిలతో తయారు చేయబడింది. ఈ పుస్తకం విలువ మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది.

రామాయణం సనాతన హిందూ ధర్మంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప గ్రంథంగా ప్రపంచ వ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది. వాల్మీకి నుండి తులసీదాసు వరకు చాలా మంది తరతరాలుగా తమదైన రీతిలో రామాయణాన్ని రచించారు. అయితే 1977లో రాంభాయ్ గోకల్‌భాయ్ రామాయణాన్ని చాలా విశిష్టంగా రాశారు. ఈ రామాయణ పుస్తకం బంగారం, 10 కిలోల వెండి, నాలుగు వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, విలువైన ముత్యాలు , నీలమణిలతో తయారు చేయబడింది. ఈ పుస్తకం విలువ మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది.

3 / 9
రామాయణ రచనలో ఉపయోగించిన సిరా కూడా బంగారంతో తయారు చేయబడింది. ఈ విలువైన రామాయణం నేటికీ శ్రీ రామ నవమి రోజున భక్తులకు దర్శనం కోసం ఉంచుతారు. 

రామాయణ రచనలో ఉపయోగించిన సిరా కూడా బంగారంతో తయారు చేయబడింది. ఈ విలువైన రామాయణం నేటికీ శ్రీ రామ నవమి రోజున భక్తులకు దర్శనం కోసం ఉంచుతారు. 

4 / 9
విహెచ్‌పి ర్యాలీ సందర్భంగా శ్రీ రామనవమి సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ విలువైన పుస్తకాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచారు. స్వర్ణ రామాయణం అని పిలువబడే ఈ పుస్తకంలోని ప్రధాన పేజీలో 11.6 గ్రాముల బంగారంతో చేసిన శివుడు, 5.8 గ్రాముల బంగారంతో చేసిన హనుమంతుని విగ్రహం ఉంది.

విహెచ్‌పి ర్యాలీ సందర్భంగా శ్రీ రామనవమి సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ విలువైన పుస్తకాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచారు. స్వర్ణ రామాయణం అని పిలువబడే ఈ పుస్తకంలోని ప్రధాన పేజీలో 11.6 గ్రాముల బంగారంతో చేసిన శివుడు, 5.8 గ్రాముల బంగారంతో చేసిన హనుమంతుని విగ్రహం ఉంది.

5 / 9
సూరత్‌లోని భేస్తాన్‌లోని లుహర్ పలియాలో నివసించే రామభక్తుడైన రాంభాయ్ గోకల్‌భాయ్ 1981లో  ఈ రామాయణాన్ని రచించాడు. 530 పేజీల పుస్తకాన్ని 9 నెలల 9 గంటల్లో పూర్తి చేశారు. 10 కిలోల వెండి, 4000 వజ్రాలు, కెంపులు, పచ్చలతో సహా ఇతర విలువైన రాళ్లను కూడా ఇందులో ఉపయోగించారు... 222 తులాల బంగారు సిరా ఉపయోగించారు. ఈ పేజీలను జర్మనీ నుండి ఆర్డర్ చేసినట్లు చెప్పారు.

సూరత్‌లోని భేస్తాన్‌లోని లుహర్ పలియాలో నివసించే రామభక్తుడైన రాంభాయ్ గోకల్‌భాయ్ 1981లో  ఈ రామాయణాన్ని రచించాడు. 530 పేజీల పుస్తకాన్ని 9 నెలల 9 గంటల్లో పూర్తి చేశారు. 10 కిలోల వెండి, 4000 వజ్రాలు, కెంపులు, పచ్చలతో సహా ఇతర విలువైన రాళ్లను కూడా ఇందులో ఉపయోగించారు... 222 తులాల బంగారు సిరా ఉపయోగించారు. ఈ పేజీలను జర్మనీ నుండి ఆర్డర్ చేసినట్లు చెప్పారు.

6 / 9
రామాయణం ప్రధాన పేజీలో శివుని విగ్రహం వెండితో తయారు చేయబడింది. అంతేకాదు పేజీలో సగం హనుమంతుడు, గణేషుడు లను కూడా ఏర్పాటు చేశారు.

రామాయణం ప్రధాన పేజీలో శివుని విగ్రహం వెండితో తయారు చేయబడింది. అంతేకాదు పేజీలో సగం హనుమంతుడు, గణేషుడు లను కూడా ఏర్పాటు చేశారు.

7 / 9
ప్రతి సంవత్సరం ఈ బంగారు రామాయణ పుస్తకాన్ని మూడు రోజుల్లో మాత్రమే భక్తుల సందర్శించుకునే వీలుంటుంది. ఈ రామాయణాన్ని ఏడాదిలో 3 సార్లు మాత్రమే చూడగలరు. మొదట సారి గురు పూర్ణిమ రోజున, రెండవసారి రామ జన్మోత్సవంలో.. మూడవసారి దీపావళి రోజున. ఈ మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో రామాయణాన్ని ప్రజా ప్రదర్శన కోసం ఉంచరు. మిగిన రోజుల్లో ఈ బంగారు రామాయణాన్ని లాకర్‌లో భద్ర పరుస్తారు., 

ప్రతి సంవత్సరం ఈ బంగారు రామాయణ పుస్తకాన్ని మూడు రోజుల్లో మాత్రమే భక్తుల సందర్శించుకునే వీలుంటుంది. ఈ రామాయణాన్ని ఏడాదిలో 3 సార్లు మాత్రమే చూడగలరు. మొదట సారి గురు పూర్ణిమ రోజున, రెండవసారి రామ జన్మోత్సవంలో.. మూడవసారి దీపావళి రోజున. ఈ మూడు రోజులు తప్ప మిగతా రోజుల్లో రామాయణాన్ని ప్రజా ప్రదర్శన కోసం ఉంచరు. మిగిన రోజుల్లో ఈ బంగారు రామాయణాన్ని లాకర్‌లో భద్ర పరుస్తారు., 

8 / 9
శ్రీరాముని జన్మదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ రామ నవమి రోజున పూజతో పాటు సూరత్ ప్రజలకు మరో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజున రామభక్తులు బంగారు రామాయణాన్ని చూడగలరు. ఈ బంగారు రామాయణం భక్తుల కోసం ప్రతి సంవత్సరం రామ నవమి రోజున ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 

శ్రీరాముని జన్మదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ రామ నవమి రోజున పూజతో పాటు సూరత్ ప్రజలకు మరో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజున రామభక్తులు బంగారు రామాయణాన్ని చూడగలరు. ఈ బంగారు రామాయణం భక్తుల కోసం ప్రతి సంవత్సరం రామ నవమి రోజున ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 

9 / 9
Follow Us