Hyderabad: ఘనంగా వెంకటేశ్వర ఉత్సవాలు.. నేత్రదర్శనం, తిరుప్పావడసేవతో పులకించిన హైదరాబాద్ వాసులు
తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవెంకటేశ్వర స్వామికి జరిగే నిత్య పూజావిధానాలను భక్తులకు ముందుకు టీటీడీ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. గోవా గవర్నర్ శ్రీ పిఎస్.శ్రీధరన్ పిళ్లై స్వామివారిని దర్శించుకున్నారు.
Most Read Stories