Rahu Dosha: ఈ రాశుల వారికి రాహు దోషాలు.. ఈ పరిహారాలు చేయడం మంచిది!
జ్యోతిషశాస్త్రంలో రాహువును ఒక విష సర్పంగా అభివర్ణించడం జరిగింది. ఎప్పుడు ఎలా కాటు వేస్తాడన్నది ముందుగా ఊహించలేం. శని, కుజుల కంటే అత్యంత పాప గ్రహం రాహువు. ప్రస్తుతం కుంభ రాశిలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి రాశిలోనూ ఏడాదిన్నర పాటు సంచారం చేసే రాహువు కుంభ రాశిలో 2026 డిసెంబర్ 5 వరకూ కొనసాగుతాడు. ఈ రాశుల వారు రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రాన్ని పఠించడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది. రాహువుకు ప్రత్యేక పూజలు చేయించడం మంచిది. అంతేకాక, తరచూ సుబ్రహ్మణ్య స్వామికి లేదా గణపతికి అర్చన చేయించడం కూడా మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6