వెయ్యి రోగాలను నయం చేసే బ్రహ్మాస్త్రం.. సకల రోగాలకు ఒక్కటే అతిబల.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

మన రోజువారీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనమందరం రకరకాల వైరస్‌లు, వ్యాధులతో బాధపడుతున్నాం. ఇప్పుడు మన ఆరోగ్యానికి అత్యుత్తమ మూలికా ఔషధం అయిన అత్యంత శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకుందాం. జలుబు, దగ్గును నయం చేయడానికి పురాతన కాలం నుండి అనేక మూలికలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం, అతిబల మొక్క, దాని పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు ప్రభావాలను తొలగించడంలో సహాయపడతాయి. సూపర్ స్ట్రాంగ్ జ్యూస్, పౌడర్ రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. అతిబల మొక్క ఉపయోగాలు, ఏయే వ్యాధులను నయం చేయవచ్చో తెలుసుకుందాం.

|

Updated on: Sep 13, 2024 | 6:15 PM

అతిబల చెట్టుని ముదురు బెండ చెట్టు అని కూడా అంటారు. ఇది పల్లెల్లో విరివిగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతుంటారు. కానీ, చూసేందుకు పిచ్చిమొక్కగా అనిపిస్తుంది.

అతిబల చెట్టుని ముదురు బెండ చెట్టు అని కూడా అంటారు. ఇది పల్లెల్లో విరివిగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతుంటారు. కానీ, చూసేందుకు పిచ్చిమొక్కగా అనిపిస్తుంది.

1 / 6
పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు, మూడు సార్లు సేవించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గి  శరీరం ఆక్టివ్ స్టేజ్ లోకి వెళ్తుంది.

పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు, మూడు సార్లు సేవించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గి శరీరం ఆక్టివ్ స్టేజ్ లోకి వెళ్తుంది.

2 / 6
కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముదురు బెండ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే  కంటికి గల దోషాలు తొలగిపోతాయని. అంతే కాక కంటి చూపు మెరుగవుతుంది.

కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముదురు బెండ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంటికి గల దోషాలు తొలగిపోతాయని. అంతే కాక కంటి చూపు మెరుగవుతుంది.

3 / 6
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఈ నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకుని, ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి, రోజుకు మూడుసార్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అంతే కాక ఇలా చేయడం వల్ల మూత్రణాల ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఈ నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకుని, ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి, రోజుకు మూడుసార్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అంతే కాక ఇలా చేయడం వల్ల మూత్రణాల ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది.

4 / 6
సాధారణంగా పిచ్చికుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో వైద్య సహాయం తొందరగా అందించ లేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయాలి. దానిని పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి తాగించి, గాయమైన చోట ఆకులను కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల పిచ్చికుక్క వల్ల కలిగే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తర్వాత నిదానంగా వైద్యున్ని సంప్రదించవచ్చు.

సాధారణంగా పిచ్చికుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో వైద్య సహాయం తొందరగా అందించ లేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయాలి. దానిని పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి తాగించి, గాయమైన చోట ఆకులను కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల పిచ్చికుక్క వల్ల కలిగే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తర్వాత నిదానంగా వైద్యున్ని సంప్రదించవచ్చు.

5 / 6
సాధారణంగా వయసుతో పాటు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని, ఒక బండపై మంచినీరు వేసి, బాగా సాదాలి. దీని నుండి వచ్చిన  మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులు అయితే ఉంటాయో, వాటిపై లేపనంగా వేయాలి.ఇలా వారం రోజులు పాటు చేస్తే ఎలాంటి నొప్పులనైనా, వాపులనైనా తగ్గిస్తుంది.

సాధారణంగా వయసుతో పాటు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని, ఒక బండపై మంచినీరు వేసి, బాగా సాదాలి. దీని నుండి వచ్చిన మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులు అయితే ఉంటాయో, వాటిపై లేపనంగా వేయాలి.ఇలా వారం రోజులు పాటు చేస్తే ఎలాంటి నొప్పులనైనా, వాపులనైనా తగ్గిస్తుంది.

6 / 6
Follow us