RCB: కోహ్లీని సాకుగా చూపారు.. కట్ చేస్తే.. లక్షలు పోసికొన్న ప్లేయర్లను సాగనంపారు.!
ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు మొత్తం 15 మ్యాచ్లు ఆడింది. ఈ పదిహేను మ్యాచ్ల్లో కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈసారి ప్లేఆఫ్స్కి చేరినా.. ఆ నెక్స్ట్ వివరాలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు తెలుసుకుందామా..?
Updated on: May 29, 2024 | 1:57 PM

ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు మొత్తం 15 మ్యాచ్లు ఆడింది. ఈ పదిహేను మ్యాచ్ల్లో కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈసారి ప్లేఆఫ్స్కి చేరినా.. ఎలిమినేటర్లో పేలవ ఆటతీరు కనబరిచింది డుప్లెసిస్ సేన.

రాబోయే ఐపీఎల్ కంటే ముందు ఆర్సీబీ.. తన జట్టులో నుంచి చాలామంది ఆటగాళ్లను విడుదల చేయనుంది. IPL 2025 మెగా వేలం కోసం కేవలం 4 మంది ఆటగాళ్లను మాత్రమే జట్టులో ఉంచుకునే అవకాశం ఉంది. 2022 మెగా వేలం మాదిరిగానే.. వచ్చే ఏడాది మెగా ఆక్షన్కి కూడా ఇదే ఫార్ములా వర్తించేలా చూస్తోంది బీసీసీఐ.

మెగా వేలానికి ముందు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అనుమతిస్తే, RCB ఈ నలుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోవచ్చు.. విరాట్ కోహ్లీని సాకుగా చూపించి.. టోర్నమెంట్ అంతా కష్టపడిన డుప్లెసిస్ను వదిలించుకునే ఛాన్స్ ఉంది ఆ ఫ్రాంచైజీ.

విరాట్ కోహ్లీ: RCB జట్టు బ్రాండ్ ఈ ప్లేయర్. కాబట్టి ఈసారి కూడా ఫ్రాంచైజీ కింగ్ కోహ్లీని నిలబెట్టుకోవడం ఖాయం. ముఖ్యంగా ఈ సీజన్లో ఆర్సీబీకి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన కోహ్లీ. 15 మ్యాచ్ల్లో 741 పరుగులు చేశాడు.

విల్ జాక్స్: ఈ ప్లేయర్ను కూడా RCB కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీ తరఫున కేవలం 8 మ్యాచ్లు ఆడిన జాక్స్ ఈసారి 1 సెంచరీ, హాఫ్ సెంచరీతో 230 పరుగులు చేశాడు.

రజత్ పాటిదార్: RCB జట్టు రజత్ పాటిదార్ను మూడవ ఆటగాడిగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈసారి 15 ఇన్నింగ్స్లు ఆడిన పాటిదార్ 5 అర్ధసెంచరీలతో మొత్తం 395 పరుగులు చేశాడు. అందువల్ల, మిడిల్ ఆర్డర్కు RCB రజత్ పాటిదార్ను కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది.

మహ్మద్ సిరాజ్: ఈ ఐపీఎల్లో సిరాజ్ ఆశించిన ప్రదర్శన చేయలేదు. అయితే 14 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. అలాగే టీమ్ ఇండియా బౌలర్ కావడంతో సిరాజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్లీ లయలోకి రాగలడు. అందువల్ల ఆర్సీబీ 4వ ఆటగాడిగా మహ్మద్ సిరాజ్ను కొనసాగించే అవకాశం ఉంది.





























