AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. రూ. 120 కోట్లతో మెగా వేలానికి..

IPL 2025: ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రతి ఫ్రాంచైజీ ఈ వేలానికి ముందు కొంతమంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోగలదు. అలాగే మిగతా ఆటగాళ్లందరినీ విడుదల చేయాల్సి ఉంది. విడుదలైన ఆటగాళ్లు మెగా వేలంలో కనిపించనున్నారు.

Venkata Chari
|

Updated on: Jul 21, 2024 | 2:56 PM

Share
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తొలి దశగా ఇప్పుడు వేలం మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్ వేలంలో ఒక్కో ఫ్రాంచైజీకి రూ. 100 కోట్లు మొత్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తొలి దశగా ఇప్పుడు వేలం మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్ వేలంలో ఒక్కో ఫ్రాంచైజీకి రూ. 100 కోట్లు మొత్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

1 / 7
అయితే, ఈసారి మెగా వేలం కారణంగా ఈ మొత్తాన్ని పెంచాలని కొందరు ఫ్రాంచైజీలు బీసీసీఐని అభ్యర్థించాయి. దీని ప్రకారం మెగా వేలం మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

అయితే, ఈసారి మెగా వేలం కారణంగా ఈ మొత్తాన్ని పెంచాలని కొందరు ఫ్రాంచైజీలు బీసీసీఐని అభ్యర్థించాయి. దీని ప్రకారం మెగా వేలం మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

2 / 7
బిడ్డింగ్ సమయంలో ఈ వేలం మొత్తంలో 75% ఉపయోగించడం తప్పనిసరి. అంటే, వేలం సమయంలో ఒక్కో ఫ్రాంచైజీ మొత్తం రూ.120 కోట్లలో రూ.90 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఏ ఫ్రాంఛైజీ అయినా 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఆ మొత్తం కంటే తక్కువకు ఏర్పాటు చేసుకోవడం కష్టం.

బిడ్డింగ్ సమయంలో ఈ వేలం మొత్తంలో 75% ఉపయోగించడం తప్పనిసరి. అంటే, వేలం సమయంలో ఒక్కో ఫ్రాంచైజీ మొత్తం రూ.120 కోట్లలో రూ.90 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఏ ఫ్రాంఛైజీ అయినా 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఆ మొత్తం కంటే తక్కువకు ఏర్పాటు చేసుకోవడం కష్టం.

3 / 7
అలాగే, రిటైన్ చేసిన ఆటగాళ్ల రెమ్యునరేషన్ మొత్తంలో రూ. 120 కోట్లు మినహాయించనున్నారు. అంటే, ఒక్కో ఫ్రాంచైజీకి నిర్దిష్ట మొత్తంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు ఈ మొత్తాన్ని ఫిక్స్ చేస్తారు.

అలాగే, రిటైన్ చేసిన ఆటగాళ్ల రెమ్యునరేషన్ మొత్తంలో రూ. 120 కోట్లు మినహాయించనున్నారు. అంటే, ఒక్కో ఫ్రాంచైజీకి నిర్దిష్ట మొత్తంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు ఈ మొత్తాన్ని ఫిక్స్ చేస్తారు.

4 / 7
ఇక్కడ అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ. 20 కోట్లు, 2వ ఆటగాడికి రూ. 15 కోట్లు, 3వ ఆటగాడికి రూ. 8 కోట్లు, 4వ ఆటగాడికి రూ. 7 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం, నలుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచేందుకు ఒక ఫ్రాంచైజీ మొత్తం వేలం మొత్తంలో రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఇక్కడ అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ. 20 కోట్లు, 2వ ఆటగాడికి రూ. 15 కోట్లు, 3వ ఆటగాడికి రూ. 8 కోట్లు, 4వ ఆటగాడికి రూ. 7 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం, నలుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచేందుకు ఒక ఫ్రాంచైజీ మొత్తం వేలం మొత్తంలో రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.

5 / 7
ఈ రూ. 50 కోట్లను రూ.120 కోట్ల నుంచి తీసివేయనున్నారు. అంటే రూ. 120-50= రూ.70 కోట్లు మిగులుతుందన్నమాట. దీని ప్రకారం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ రూ.70 కోట్లతో వేలంలో కనిపించనుంది.

ఈ రూ. 50 కోట్లను రూ.120 కోట్ల నుంచి తీసివేయనున్నారు. అంటే రూ. 120-50= రూ.70 కోట్లు మిగులుతుందన్నమాట. దీని ప్రకారం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ రూ.70 కోట్లతో వేలంలో కనిపించనుంది.

6 / 7
ఈ విషయంపై చర్చించేందుకు బీసీసీఐ ఈ నెలాఖరులో ఐపీఎల్ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసింది. ఐపీఎల్ మెగా వేలం రూపురేఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త నిబంధనలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అందుకే, ఈ భేటీ తర్వాత మెగా వేలం కొత్త నిబంధనలపై స్పష్టత రానుంది.

ఈ విషయంపై చర్చించేందుకు బీసీసీఐ ఈ నెలాఖరులో ఐపీఎల్ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసింది. ఐపీఎల్ మెగా వేలం రూపురేఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త నిబంధనలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అందుకే, ఈ భేటీ తర్వాత మెగా వేలం కొత్త నిబంధనలపై స్పష్టత రానుంది.

7 / 7
Follow Us