Rajeev Rayala |
Updated on: Jun 05, 2024 | 6:43 PM
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కంగనా రనౌత్ విజయం సాధించారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే తొలి ప్రయత్నంలోనే కంగనా విజయం సాధించింది.
ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేశారు. తొలి ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపింది కంగనా రనౌత్.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. యాక్చువల్గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావల్సి ఉంది. ఆ ప్లాన్తోనే ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు.
కంగనా ప్రస్తుతం ఆమె నటించి దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. దీని ఆధారంగానే కంగనా కథ రాసుకుని సినిమా చేసింది.