- Telugu News Photo Gallery Cinema photos Rashmika mandanna in ravitejas next movie ajith next movie details
మాస్ మహరాజ్తో రష్మిక.. దీపావళికి రానున్న ధృవ నక్షత్రం
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ, నెక్ట్స్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు హీరోయిన్ షాక్ ఇచ్చారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్గా కృతిసనన్ చెల్లెలు నుపుర్ సనన్ను ఫైనల్ చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవటంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని హీరో విష్ణు స్వయంగా ప్రకటించారు.
Updated on: Sep 21, 2023 | 9:52 PM

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ, నెక్ట్స్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది.

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు హీరోయిన్ షాక్ ఇచ్చారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్గా కృతిసనన్ చెల్లెలు నుపుర్ సనన్ను ఫైనల్ చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవటంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని హీరో విష్ణు స్వయంగా ప్రకటించారు.

అజిత్ హీరోగా తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. మరో విలన్గా ఆరవ్ నటిస్తున్నారు. అజిత్కు జోడిగా త్రిష కనిపిస్తారని వెల్లడించారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ వచ్చే నెల అబుదాబిలో ప్రారంభం కానుంది.

విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధృవ నక్షత్రం. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్గా ఈ ఏడాది దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావటంతో ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, రాఘవ్ చద్దాల వివాహ వేడుక మొదలైంది. ఈ నెల 23, 24 తేదిల్లో పెళ్లి జరగనుంది. దీంతో బుధవారం నుంచే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో జరగనున్న పెళ్లి వేడుకకు 200 మంది అతిథులతో పాటు 50 మంది వీవీఐపీలకు ఆహ్వానాలు అందాయి.




