- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor Ramayana Make Way In Three Parts, Here is the latest Update
Ramayana: రామాయణం మెగా ప్రాజెక్ట్పై అదిరిపోయే అప్డేట్
రామాయణం అనేది భారతీయులకు కేవలం ఓ పురాణం మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. చెప్పే తీరులో చెప్తే ఎన్ని సార్లైనా చూస్తారు ఆడియన్స్. తేడాగా చూపిస్తే ఫలితం కూడా అంతే దారుణంగా ఉంటుంది. మరి ఇప్పుడు నితీష్ తివారి రామాయణం ఎలా ఉండబోతుంది..? ఎన్ని భాగాలుగా రాబోతుంది..? ఇన్నేళ్ళు ఒకే సినిమాకు డేట్స్ ఇస్తారా..? రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు మాత్రమే కాదు.. మన సంప్రదాయాలకు పెట్టనికోట.
Updated on: May 24, 2024 | 8:17 PM

రామాయణం అనేది భారతీయులకు కేవలం ఓ పురాణం మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. చెప్పే తీరులో చెప్తే ఎన్ని సార్లైనా చూస్తారు ఆడియన్స్. తేడాగా చూపిస్తే ఫలితం కూడా అంతే దారుణంగా ఉంటుంది.

మరి ఇప్పుడు నితీష్ తివారి రామాయణం ఎలా ఉండబోతుంది..? ఎన్ని భాగాలుగా రాబోతుంది..? ఇన్నేళ్ళు ఒకే సినిమాకు డేట్స్ ఇస్తారా..? రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు మాత్రమే కాదు.. మన సంప్రదాయాలకు పెట్టనికోట.

అందుకే ఆ మైథలాజికల్ వండర్స్ తెరకెక్కించేందుకు దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తాజాగా దంగల్ ఫేమ్ నితీష్ తివారి కూడా దాదాపు 800 కోట్లతో రామాయణం తెరకెక్కిస్తున్నారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ఇందులో సీతా రాములుగా నటిస్తున్నారు.

మార్చిలోనే రామాయణం షూటింగ్ మొదలైంది. ఇప్పటికే రణ్బీర్, సాయి పల్లవిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు నితీష్. వాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాను 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు.

ఫస్ట్ పార్ట్లో సీతా రాముల స్వయంవరం.. సెకండ్ పార్ట్లో వనవాసం, సీతా అపహరణ.. మూడో భాగంలో రామ రావణ యుద్ధం చూపించబోతున్నారని తెలుస్తుంది. 2027లో రామాయణం విడుదలయ్యేలా కనిపిస్తుంది.

ప్లానింగ్ అంతా బాగానే ఉంది కానీ.. రణ్బీర్, సాయి పల్లవితో పాటు యశ్ ఈ సినిమాకు మూడేళ్ళ పాటు డేట్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా చేస్తున్నారు.. సాయి పల్లవికి ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని రామాయణం కోసం మూడేళ్లు కేటాయిస్తారా అనేది చూడాలి.




