Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్లో పెరిగిన జోరు
షూటింగ్ చివరిదశకు వచ్చింది.. దాంతో సినిమాపై అంచనాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు పూరీ జగన్నాథ్. మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు.. మొన్నటి వరకు ఏం చూపించలేదు కానీ అప్పుడే టీజర్ విడుదల చేసారు.. ఇప్పుడు మేకింగ్ కూడా ఇచ్చేసారు. ఉన్నట్లుండి డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థమేంటి..? చూస్తున్నారుగా.. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్లో పూరీ జగన్నాథ్ జోష్. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆరేడు నెలల పాటు కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఈయన..
Updated on: May 24, 2024 | 8:28 PM

షూటింగ్ చివరిదశకు వచ్చింది.. దాంతో సినిమాపై అంచనాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు పూరీ జగన్నాథ్. మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు.. మొన్నటి వరకు ఏం చూపించలేదు కానీ అప్పుడే టీజర్ విడుదల చేసారు.. ఇప్పుడు మేకింగ్ కూడా ఇచ్చేసారు.

ఉన్నట్లుండి డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థమేంటి..? చూస్తున్నారుగా.. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్లో పూరీ జగన్నాథ్ జోష్. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆరేడు నెలల పాటు కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఈయన.. చివరికి రామ్తోనే మరోసారి ఇస్మార్ట్ కథను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకే ప్రమోషన్స్లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. ఎందుకో తెలియదు కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో ముందు నుంచి కాస్త సైలెంట్గానే ఉన్నారు పూరీ జగన్నాథ్.

తన గత సినిమాల స్థాయిలో దీనికి హంగామా చేయలేదు. తన తీరుకు భిన్నంగా చాలా సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసారు. టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి.. ఇప్పుడు జోరు పెంచేసారు పూరీ. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుంది.

పేరుకు తెలుగు సినిమా అయినా.. పూర్తిగా బాలీవుడ్ స్టైల్లోనే తెరకెక్కిస్తున్నారు పూరీ. సంజయ్ దత్ రాకతో హిందీలోనూ దీనిపై క్రేజ్ పెరిగింది. జూన్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. కావ్య థపర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు.




