కృష్ణవంశీ, వినాయక్, పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి... వీళ్లంతా ఒకప్పుడు కమర్షియల్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసిన వారే. అప్పటి వరకు ఓ మూసలో పోతున్న తెలుగు సినిమాకు కొత్త దారి చూపించిన వారే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా అప్డేట్ అవ్వలేకపోయిన ఈ టాప్ డైరెక్టర్స్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.