AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంసాహార మొక్కలను కొనుగోన్న శాస్త్రవేత్తలు.. వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..

వేటాడే మాంసాహార మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో ఉన్నాయంట. శాస్త్రవేత్తలు దీనిని పిచర్ ప్లాంట్ అని పిలుస్తున్నారు.

మాంసాహార మొక్కలను కొనుగోన్న శాస్త్రవేత్తలు.. వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..
Carnivorous Plant
Venkata Chari
|

Updated on: Jul 06, 2022 | 9:04 PM

Share

మనం తరచుగా మొక్కలను శాంతియుత జీవులుగా చూస్తుంటాం. కానీ, అన్ని మొక్కలు ప్రశాంతంగా ఉండవు. కొన్ని మొక్కలు వేటాడతాయని మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. మొక్కల్లో మాంసాహారులు కూడా ఉన్నాయి. ఇటీవల, శాస్త్రవేత్తలు వేటాడే మాంసాహార మొక్కలను కనుగొన్నారు. ఇవి కీటకాలు, సాలెపురుగులు లేదా ఇతర చిన్న జీవులను వేటాడి, తింటుంటాయి. కొన్నిసార్లు అవి నేల పోషకాల సహాయంతో మనుగడ సాగిస్తాయి. అయితే, కీటకాలను మాత్రం ఇష్టపడి తినేస్తుంటాయంట.

ఇండోనేషియాలోని ఉత్తర కాలిమంటన్ ప్రావిన్స్‌లోని బోర్నియో ద్వీపంలో శాస్త్రవేత్తలు ఈ మొక్కను కనుగొన్నారు. తొలిసారిగా ఇలాంటి జాతిని కనుగొన్నారు. ఇంతకు ముందు, వృక్షశాస్త్రజ్ఞులకు అలాంటి మొక్క గురించి తెలియకపోవడం గమనార్హం. దీని శాస్త్రీయ నామం Nepenthes pudica. దీని వేట పద్ధతి కూడా మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం దీనిని పిచ్చర్ ప్లాంట్ అని పిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నేల లోపల లేదా బోలు కాండంలో పెరుగుతాయి..

చెక్ రిపబ్లిక్‌లోని పాలకీ యూనివర్శిటీ ఒలోమౌక్‌లోని వృక్షశాస్త్రజ్ఞుడు మార్టిన్ డానక్, ఈ మొక్క ఒక కాడ ఆకారపు వెబ్‌ను వేస్తుందని తెలిపారు. కానీ, ఈ ఉచ్చు ఎలా ఏర్పడిందో తెలియదంట. సాధారణంగా ఇటువంటి మొక్కలు నేలపై ఉపరితలంపై లేదా చెట్ల బోలు ట్రంక్లలో లేదా ట్యూబ్ లాంటి భాగాలలో పెరుగుతాయి. 2012లో ఉత్తర కాళీమంతన్‌లో కనిపించిన పిచర్ వంటి ఇతర మొక్కలు కూడా ఉన్నాయి.

ఆహారంగా వేటిని తింటాయంటే..

ఈ కొత్త జాతి మొక్క కనుగొన్న సమయంలో దాని చుట్టూ ఉన్న భూమిని పరిశోధించారు. ఇవి భూమి నుంచి పెరుగుతున్నాయని తేలింది. ఎందుకంటే వాటి విత్తనాలు కూడా మొలకెత్తుతున్నాయి. ఆకస్మికంగా వేటాడే ఈ మాంసాహార మొక్క, దాని 4.3 అంగుళాల పొడవైన కాడను భూమి లోపల ఉంచుతుంది. ఇక్కడ నుంచి భూమిలో నివసించే జీవులను ట్రాప్ చేస్తాయంట. చీమలు, పురుగులు మొదలైన వాటిని తమ ఆహారంగా మార్చుకుంటాయంట.

శాస్త్రవేత్తల బృందం మరింత పరిశోధనలు చేయగా, అక్కడ 17 అవశేషాలు కనిపించాయంట. కొన్ని పూర్తిగా జీర్ణం అయ్యాయి. సాధారణంగా ఈ మొక్క సముద్ర మట్టానికి దాదాపు 3600 నుంచి 4300 అడుగుల ఎత్తులో కొండలపై కనిపిస్తుందంట.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..