Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు

భారత్‌లోనూ మరింతగా కరోనా విజృంభిస్తోంది. వ్యాపించే వైరస్ కావడంతో.. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా.. కట్టడి పడటం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 3 వేలు దాటింది. అందులోనూ దీనికి మందు లేకపోవడంతో.. ప్రపంచదేశాల అధ్యక్షులు తలలు పట్టుకుంటున్నారు. కాగా దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతం ఢిల్లీ జమాత్ మర్కజ్‌కు సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే వయస్కులవారికి కోవిడ్ ఎక్కువగా సోకుంతుందనే విషయాన్ని కూడా వెల్లడించింది. దీంతో కరోనా బారిన పడుతున్న […]

మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 05, 2020 | 8:23 AM

భారత్‌లోనూ మరింతగా కరోనా విజృంభిస్తోంది. వ్యాపించే వైరస్ కావడంతో.. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా.. కట్టడి పడటం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 3 వేలు దాటింది. అందులోనూ దీనికి మందు లేకపోవడంతో.. ప్రపంచదేశాల అధ్యక్షులు తలలు పట్టుకుంటున్నారు. కాగా దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతం ఢిల్లీ జమాత్ మర్కజ్‌కు సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే వయస్కులవారికి కోవిడ్ ఎక్కువగా సోకుంతుందనే విషయాన్ని కూడా వెల్లడించింది. దీంతో కరోనా బారిన పడుతున్న వారిలో 83 శాతం మంది 60 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

తాజాగా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం మనదేశంలోని కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు వారు 9 శాతం మంది ఉండగా.. 21-40 ఏళ్ల మధ్య 42 శాతం మంది ఉన్నారని, అలాగే 41-60 ఏళ్ల మధ్య వయస్కులు 33 శాతం ఉండగా, కేవలం 17 శాతం మంది మాత్రమే 60 ఏళ్లు పైబడిన వారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 58 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక మిగతా దేశాల్లో వృద్ధులు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతుండగా.. మనదేశంలో మాత్రం 60 శాతం బాధితులు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు కావడం గమనార్హం. ఈ లెక్కన యువత, మధ్య వయస్సున్నవారు కరోనా బారిన పడరనే భావన తప్పని.. కేంద్రం విడుదల చేసిన గణాంకాలతో తేలింది.

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం