New Toll Policy: వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్
టోల్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు ఇది శుభవార్తే. ఇప్పటి వరకు ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా టోల్ చార్జీలు వసూలు చేస్తుండగా, ఇకపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. టోల్ గేట్ల వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఆధారిత విధానం మే 1 నుంచి అమల్లోకి రానుంది.
తొలుత వాణిజ్య వాహనాలకు, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు అమలు చేయనున్నారు. అప్పటి వరకు మాత్రం టోల్ గేట్లు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా మన ఫోన్లలో ఉండే GPS విధానానికి ఈ GNSS పూర్తిగా భిన్నం. జీపీఎస్ అనేది ఒకే ఒక్క శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థ. కానీ GNSS అనేది పలు దేశాలకు చెందిన నేవిగేషన్ ఉపగ్రహాలతో అనుసంధానమవుతుంది. రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్కు చెందిన గెలీలియో, చైనాకు చెందిన బైదు, భారత్కు చెందిన గగన్, నావిక్ తదితర నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వేర్వేరు ఉపగ్రహాలకు ఒకేసారి అనుసంధానమై అత్యంత కచ్చితమైన లొకేషన్ గుర్తింపుతోపాటు నావిగేషన్ పొందే విధానమే జీఎన్ఎస్ఎస్. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనాలు ఏయే రోడ్లపై ఎంతదూరం ప్రయాణించాయన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానంలో టోలు అమలు చేసేందుకు బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు తదితర టోల్ వర్తించే వాహనాల్లో OUB గా పిలిచే ఆన్బోర్డు యూనిట్లను బిగించుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్
Meenakshi Chaudhary: డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??
Allu Arjun: వీడేం హీరో అనే స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్..
షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

