కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్
ప్రమాదంలో కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్ చేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. దీంతో కోటా మెడికల్ కాలేజీ వైద్యుల నిర్లక్ష్యం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనకు ప్రమాదం జరిగితే.. తనకు బదులుగా తండ్రికి శస్త్రచికిత్స చేశారని ఒక వ్యక్తి ఆరోపించాడు. మనీష్ అనే వ్యక్తికి ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.
వైద్యులు శస్త్రచికిత్స అవసరం అని సూచించడంతో అందుకోసం సిద్ధంగా ఉన్నాడు. తన తండ్రి ఆపరేషన్ థియేటర్ వెలుపల వేచి ఉండగా, తాను ఆసుపత్రిలో చేరానని, శస్త్రచికిత్సకు సిద్ధమయ్యానని మనీష్ చెప్పాడు. అయితే, తరువాత ఏం జరిగిందో చూసి సాక్కు గురైనట్లు అన్నాడు. తనకు శస్త్రచికిత్స శనివారం జరగాల్సి ఉంది, కాబట్టి తను ఆపరేషన్ థియేటర్ వెలుపల వేచి ఉండమని తండ్రికి చెప్పాననీ మనీష్ అన్నాడు. తను ఆపరేషన్ థియేటర్ లోపల ఉన్నాననీ ఇంతలో ఏం జరిగిందో తనకు తెలియదనీ కానీ తన తండ్రి శరీరంపై 5 నుంచి 6 కుట్లు ఉన్నాయి అని మనీష్ చెప్పాడు. కోటా మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత సక్సేనా, ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి 2-3 రోజుల్లో నివేదిక అందించమని తను సూపరింటెండెంట్ను కోరినట్లు ఆమె అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
New Toll Policy: వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్
మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్
Meenakshi Chaudhary: డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??
Allu Arjun: వీడేం హీరో అనే స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్..
షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

